Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : మరో జాన్వీ కపూర్ అయ్యేనా?

దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ ఇప్పుడు బాలీవుడ్ లో హీరోయిన్ గా వరుస సినిమాల్లో నటిస్తోంది.

By:  Tupaki Desk   |   14 Feb 2024 3:30 AM GMT
పిక్ టాక్ : మరో జాన్వీ కపూర్ అయ్యేనా?
X

సినిమా ఇండస్ట్రీలో వారసత్వం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. హీరోల హీరోయిన్స్ వారసులు మొదలుకుని టెక్నీషియన్స్ వారసుల వరకు ఎంతో మంది ఇండస్ట్రీలో అడుగు పెట్టి వారి ప్రతిభను చూపిస్తున్నారు. వారసత్వం తో వచ్చిన వారు ప్రతిభ లేకుంటే కొందరు కనుమరుగవుతున్నారు. కొందరు మాత్రం స్టార్స్ అవుతున్నారు.


దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ ఇప్పుడు బాలీవుడ్ లో హీరోయిన్ గా వరుస సినిమాల్లో నటిస్తోంది. టాలీవుడ్‌ లో దేవర సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది. చరణ్, బుచ్చిబాబు సినిమాలో కూడా జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. జాన్వీ కపూర్ మాదిరిగా సీనియర్ హీరోయిన్ రంభ కూతురు కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుందా అనే చర్చ మొదలయ్యింది.

హీరోయిన్ గా 1990 ల్లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ రంభ. తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా రంభ సినిమాలు చేసి ఆకట్టుకుంది. పెళ్లి, పిల్లలు తర్వాత రంభ సినిమాలకు దూరం అయ్యింది. ఆమె మళ్లీ నటించాలని ఆసక్తిగా ఉన్నట్లు ఆ మధ్య ప్రకటించింది. కానీ ఆమె స్థాయికి తగ్గ పాత్రలు లభిస్తున్నట్లు లేదు.

నటిగా కనిపించకున్నా సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటారు. రంభ తాజాగా తన కూతురు ఫోటోను షేర్‌ చేసి మై ఏంజిల్ అంటూ కామెంట్‌ పెట్టింది. రంభ కూతురు చాలా అందంగా ఉందని, తల్లికి తగ్గ తనయ అనిపించుకునేంత అందం ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

చాలా మంది హీరోయిన్స్ కూతుర్ల మాదిరిగానే రంభ కూతురు కూడా హీరోయిన్‌ గా నటిస్తే బాగుంటుంది అనే అభిప్రాయంను అప్పుడే కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ పాప వయసు ఇప్పుడు చాలా తక్కువ. కనుక ఇప్పటి నుంచే అలాంటి ఆలోచనలు అనవసరం అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి కామెంట్స్ వస్తాయి అనే ఉద్దేశ్యంతోనే చాలా మంది సెలబ్రిటీలు తమ పిల్లల ఫోటోలను షేర్‌ చేసేందుకు భయపడుతారు అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.