చరణ్ పెద్ది అలా షాక్ ఇస్తారా..?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా తర్వాత బుచ్చి బాబు డైరెక్షన్ లో పెద్ది సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 23 May 2025 1:30 AMగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా తర్వాత బుచ్చి బాబు డైరెక్షన్ లో పెద్ది సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగా పెట్టేస్తున్నారని తెలుస్తుంది. ఉప్పెన తర్వాత బుచ్చి బాబు చేస్తున్న సినిమాగా పెద్ది మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తక్కువ కాకుండా ఈ సినిమా ఉండాలని చూస్తున్నాడు. అందుకే సినిమా విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదని తెలుస్తుంది.
ఒక సినిమా అనుభవం మాత్రమే ఉన్న బుచ్చి బాబుకి కెరీర్ లో మంచి పీక్స్ మూమెంట్ ఉన్న టైం లో ఛాన్స్ ఇచ్చాడు చరణ్. అందుకే పెద్దితో చరణ్ కి ఒక తిరుగులేని హిట్ ఇవ్వాలని కసితో పనిచేస్తున్నాడు బుచ్చి బాబు. పెద్ది సినిమా ఫస్ట్ షాట్ తోనే బుచ్చి బాబు ఈ సినిమా ఎలాంటి క్రియేట్ చేస్తుందో చూపించాడు. జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న పెద్ది సినిమాకు అకాడమీ విన్నర్ ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఐతే లేటెస్ట్ గా ఈ సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బుచ్చి బాబు చరణ్ కలిసి చేస్తున్న పెద్ది సినిమా ఒక భాగంగా కాదు రెండు పార్టులుగా వస్తుందని అంటున్నారు. ఒక కథని రెండు ముక్కలుగా చేసి చెప్పడం రాజమౌళి బాహుబలి తో మొదలైంది. అప్పటి నుంచి పెద్ద బడ్జెట్ తో వస్తున్న ప్రతి స్టార్ సినిమా ఇదే పంథాలో రెండు భాగాలుగా చేస్తున్నారు. సుకుమార్ ఇంకాస్త ముందుకెళ్లి పుష్ప 2 కాదు పార్ట్ 3 కూడా ఉంటుందని షాక్ ఇచ్చాడు.
ఇదే తరహాలో పెద్ది సినిమాను కూడా రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నాడట బుచ్చి బాబు. ఐతే ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉంది అన్నది తెలియాల్సి ఉంది. పెద్ది సినిమా ఫస్ట్ షాట్ తో మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఫుల్ ఖుషి అయ్యారు. సినిమా తప్పకుండా చరణ్ మాస్ స్టామినా చూపించేలా ఉంటుందని అనుకుంటున్నారు. ఈ సినిమాలో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు. మరి చరణ్ పెద్ది నిజంగానే రెండు భాగాలు ఉంటుందా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది. పెద్ది ఫస్ట్ షాట్ మాత్రమే కాదు చరణ్ కొట్టే షాట్ తో బాక్సాఫీస్ షేక్ ఆడాల్సిందే అని మెగా ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు.