Begin typing your search above and press return to search.

అప్ప‌ట్లో క్వీన్ ఎలిజ‌బెత్2.. ఇప్పుడు చ‌ర‌ణ్‌

ఈ విగ్ర‌హాన్ని మే 19 నుంచి ప్ర‌జ‌ల సంద‌ర్శ‌నార్థం త‌ర‌లించనున్నారు. అయితే చ‌ర‌ణ్ విగ్ర‌హాన్ని మేడ‌మ్ టుస్సాడ్స్ రూపొందించిన విధానం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.

By:  Tupaki Desk   |   12 May 2025 1:50 PM
అప్ప‌ట్లో క్వీన్ ఎలిజ‌బెత్2.. ఇప్పుడు చ‌ర‌ణ్‌
X

చిరంజీవి కొడుకుగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చ‌ర‌ణ్ ఆ త‌ర్వాత త‌న‌కంటూ సొంత గుర్తింపు తెచ్చుకుని మెగా ప‌వ‌ర్ స్టార్ అయ్యాడు. ఆ త‌ర్వాత ఆ గుర్తింపు ను ప్ర‌పంచానికి తెలియ‌చేసి ఇప్పుడు గ్లోబ‌ల్ స్టార్ గా గుర్తింపు పొందాడు. ఇప్ప‌టికే చ‌ర‌ణ్ త‌న కెరీర్లో ఎన్నో సాధించాడు. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత చ‌ర‌ణ్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌సిద్ధి చెందాడు.

ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ మ‌రో అరుదైన ఘ‌న‌త సాధించాడు. ప్ర‌తిష్టాత్మ‌క మేడ‌మ్ టుస్సాడ్స్ మ్యూజియంలో పెంపుడు జంతువుల ప‌ట్ల ప్రేమ‌, క‌రుణ చూపించే ఇండియ‌న్ స్టార్ గా చ‌ర‌ణ్ మైన‌పు విగ్ర‌హాన్ని మేడ‌మ్ టుస్సాడ్స్ లో పెట్టారు. మే 9న ఈ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌గా అందులో రియ‌ల్ చ‌ర‌ణ్ ఎవ‌రు? మైనపు విగ్ర‌హం ఏద‌నేది గుర్తు ప‌ట్ట‌లేక‌పోతున్నారు.

పెంపుడు జంతువులపై ప్రేమ చూపించాలి, వాటి గురించి కేర్ తీసుకోవాల‌ని అంద‌రూ చెప్తుంటారు కానీ చెప్పిన మాట మీద న‌డిచే వాళ్లు చాలా అంటే చాలా తక్కువ మంది ఉంటారు. రామ్ చ‌ర‌ణ్ త‌న పెంపుడు కుక్క రైమ్ పై ఉన్న ప్రేమ‌ను అంద‌రికీ తెలిసేలా చేశాడు. మేడ‌మ్ టుస్సాడ్స్ లో త‌న విగ్ర‌హంతో పాటూ రైమ్ మైన‌పు విగ్ర‌హాన్ని కూడా ఏర్పాటు చేయాల‌ని ఎంతో ప‌ట్టుబ‌ట్ట‌డం వ‌ల్లే ఇది సాధ్య‌మైంది.

ఈ వ్యాక్స్ మ్యూజియంలో క్వీన్ ఎలిజ‌బెత్2 త‌ర్వాత ఈ స్టేట్‌మెంట్ చేసిన ఏకైక సెల‌బ్రిటీ రామ్ చ‌ర‌ణ్ మాత్ర‌మే. మేడ‌మ్ టుస్సాడ్స్ లో చ‌ర‌ణ్ విగ్ర‌హం ఆవిష్క‌రణ సంద‌ర్భంగా ఆ కార్య‌క్ర‌మానికి చ‌ర‌ణ్ తండి చిరంజీవి, త‌ల్లి సురేఖ‌, భార్య ఉపాస‌న‌తో పాటూ వారి పెంపుడు కుక్క రైమ్ కూడా హాజ‌రైంది. ఈ సంద‌ర్భంగా చ‌ర‌ణ్ కుటుంబ స‌భ్యుల మొహాల్లో కాంతులు వెద‌జ‌ల్లుతున్నాయి. విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ మైన‌పు విగ్ర‌హంతో మెగా ఫ్యామిలీ తీసుకున్న ఫోటో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతుంది.

ఈ విగ్ర‌హాన్ని మే 19 నుంచి ప్ర‌జ‌ల సంద‌ర్శ‌నార్థం త‌ర‌లించనున్నారు. అయితే చ‌ర‌ణ్ విగ్ర‌హాన్ని మేడ‌మ్ టుస్సాడ్స్ రూపొందించిన విధానం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. నిజ‌మేదో బొమ్మేదో అర్థం కాకుండా ఉండేలా ఈ విగ్ర‌హాన్ని వారు రూపొందించారు. చ‌ర‌ణ్ విగ్రహాన్ని మాత్ర‌మే కాదు, రైమ్ విగ్ర‌హాన్ని కూడా చాలా డీటెయిలింగ్ గా ఎంతో చ‌క్క‌గా రూపొందించారు. ఇక చ‌ర‌ణ్ కెరీర్ విష‌యానికొస్తే అత‌ను ప్ర‌స్తుతం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో పెద్ది అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.