Begin typing your search above and press return to search.

80 కోట్ల ఫ్లాట్‌ను శిల్పాశెట్టికి 38 కోట్లకే అమ్మాడు!

ED అంతర్గత స్కీమ్‌ను అనుమానించింది.. శిల్పా శెట్టి స్టేట్‌మెంట్‌ను కోరింది.

By:  Tupaki Desk   |   20 April 2024 12:22 PM GMT
80 కోట్ల ఫ్లాట్‌ను శిల్పాశెట్టికి 38 కోట్లకే అమ్మాడు!
X

గెయిన్ బిట్‌కాయిన్ స్కామ్‌పై ED విచారణ సందర్భంగా రాజ్ కుంద్రా జుహు ఫ్లాట్‌ను శిల్పాశెట్టికి స‌గం ధ‌ర‌కే విక్ర‌యించ‌డం వెన‌క కార‌ణాల‌పై ఈడీ ఆరాలు తీస్తోంది. ఈ వివాదంలో బిట్ కాయిన్ ల పాత్ర పెద్ద‌దేన‌ని ఈడీ అనుమానిస్తోంది. ED అంతర్గత స్కీమ్‌ను అనుమానించింది.. శిల్పా శెట్టి స్టేట్‌మెంట్‌ను కోరింది.

మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణ ప్రారంభించిన తర్వాత వ్యాపారవేత్త రాజ్ కుంద్రా తన రూ.80 కోట్ల విలువైన జుహు ఫ్లాట్‌ను 2022లో తన భార్య శిల్పాశెట్టికి రూ.38 కోట్లకు విక్రయించారు. ఆస్తి అటాచ్‌మెంట్‌ను నివారించడానికి ఇది దంపతుల అంతర్గత ఏర్పాటు అని అనుమానిస్తున్నారు. కుంద్రా ఇప్పటికీ ఫ్లాట్ కి నిజమైన యజమాని అని ఈడీ అనుమానిస్తోంది. ఉక్రెయిన్‌లో బిట్‌కాయిన్ మైనింగ్ ఫారమ్‌ను ఏర్పాటు చేసినందుకు గాను బిట్‌కాయిన్ పోంజీ స్కామ్‌కు సూత్రధారి ప్రమోటర్ అమిత్ భరద్వాజ్ (ఇప్పుడు మరణించారు) నుండి కుంద్రా 285 బిట్‌కాయిన్‌లను అందుకున్నట్లు గురువారం ED పత్రికా ప్రకటన విడుదల చేసింది.

భ‌రద్వాజ్ మోసపూరిత పెట్టుబడిదారుల నుండి నేర‌పూరిత‌ బిట్‌కాయిన్‌లను సేకరించారు. ఒప్పందం కార్యరూపం దాల్చనందున కుంద్రా ఇప్పటికీ 285 బిట్‌కాయిన్ లు త‌న‌తోనే ఉన్నాయి. వాటి విలువ ప్రస్తుతం రూ. 150 కోట్లకు పైగా ఉంది! అని ఏజెన్సీ తెలిపింది. బిట్‌కాయిన్‌లు ఇప్పటికీ కుంద్రా ఆధీనంలోనే ఉన్నాయని ED విశ్వసిస్తోంది. దానిని బహిర్గతం చేయకుండా బిట్‌కాయిన్‌ల విలువకు సమానమైన అతడి ఆస్తులను ఏజెన్సీ అటాచ్ చేస్తోంది. పూణేలోని అతని బంగ్లాను అటాచ్ చేసిన తర్వాత కుంద్రా ఇతర ఆస్తుల గురించి, అతడి పేరులోని ఈక్విటీ షేర్లు .. శెట్టి కి చెందిన‌ జుహు ఫ్లాట్ మొత్తం రూ. 97.8 కోట్ల గురించి ED ఆరా తీస్తోంది. అటాచ్ చేసిన ఆస్తులు నేరం తాలూకా ఆదాయానికి నేరుగా అనుసంధానించలేదు... ఈ కేసులో శిల్పాశెట్టి స్టేట్‌మెంట్ కోసం ఏ స‌మ‌యంలోనైనా ED శెట్టిని పిలవవచ్చు. జుహు ఫ్లాట్ లావాదేవీకి సంబంధించిన ఆరోపణపై వ్యాఖ్యానించడానికి కుంద్రా -శెట్టి ల‌ PR నిరాకరించార‌ని జాతీయ మీడియా వెల్ల‌డించింది.

ఈడీ ఆరోపించిన విధంగా కుంద్రాకు ఒక్క బిట్‌కాయిన్ కూడా అందలేదని దంపతుల తరఫు న్యాయవాది ప్రశాంత్ పాటిల్ తెలిపారు. నా క్లయింట్లు రాజ్ కుంద్రా - శిల్పాశెట్టి కుంద్రాలపై ప్రాథమికంగా ఎలాంటి కేసు లేదు. న్యాయస్థానంలో విచారణపై మాకు నమ్మకం ఉంది. అవసరమైనప్పుడు అధికారులకు సహకరించడానికి మేము కట్టుబడి ఉన్నాము అని ఆయన అన్నారు. అంతకుముందు బిట్‌కాయిన్ మైనింగ్ కోసం భరద్వాజ్‌కు కన్సల్టెన్సీ సేవలను అందించినట్లు కుంద్రా తన ప్రకటనలో ఈడీకి తెలిపారు. భరద్వాజ్ సోదరులు అమిత్ - అజయ్ తన బిట్‌కాయిన్ వాలెట్ ద్వారా క్రిప్టోకరెన్సీని మరో వ్యాలెట్‌లోకి మార్చుకున్నారని, గ్రహీత ఎవరో తనకు తెలియదని ఆయన చెప్పారు. పూణేకు చెందిన భరద్వాజ్ సోదరులు సింగపూర్‌కు చెందిన వేరియబుల్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని ప్రమోట్ చేశారు. గెయిన్‌బిట్‌కాయిన్.కామ్‌ నియంత్రణ‌లో మంచి రాబడిని వాగ్దానం చేయడం ద్వారా పెట్టుబడిదారులను ఆకర్షించింది. Gainbitcoin.com ద్వారా సోదరులు పెట్టుబడిదారుల నుండి 6,600 కోట్ల రూపాయలకు సమానమైన క్రిప్టోకరెన్సీని సేకరించారు. చెల్లింపులో డిఫాల్ట్ చేసారు. అస్పష్టమైన ఆన్‌లైన్ వాలెట్లలో అక్రమంగా సంపాదించిన బిట్‌కాయిన్‌లను దాచారు. ఇన్వెస్టర్లు కొన్నేళ్ల క్రితం భరద్వాజ్ సోదరులపై వివిధ ప్రాంతాల్లో పోలీసు కేసులు పెట్టగా, దాని ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.