Begin typing your search above and press return to search.

కమల్​ ట్రాక్​ ఎక్కేశారు.. మరి రజనీ పరిస్థితేంటో?

పాన్​ ఇండియా ట్రెండ్ రాక ముందే ఈ ఇద్దరూ పాన్​ ఇండియా రేంజ్​లో అభిమానుల ను సంపాదించుకున్నారు. ఇప్పటికీ ఈ అగ్రహీరోల సినిమాలు వస్తున్నాయంటే ప్రేక్షకులు భారీ ఆసక్తి నెలకొంటుంది.

By:  Tupaki Desk   |   5 Aug 2023 10:53 AM GMT
కమల్​ ట్రాక్​ ఎక్కేశారు.. మరి రజనీ పరిస్థితేంటో?
X

నటన లో సరిహద్దులు చెరిపేసిన స్టార్స్‌ రజనీకాంత్‌ - కమల్‌హాసన్‌. దాదాపు ఐదు దశాబ్దాలుగా కోలీవుడ్​ ఇండస్ట్రీలో తిరుగులేని తారలుగా వెలుగొందుతున్నారు. పాన్​ ఇండియా ట్రెండ్ రాక ముందే ఈ ఇద్దరూ పాన్​ ఇండియా రేంజ్​లో అభిమానుల ను సంపాదించుకున్నారు. ఇప్పటికీ ఈ అగ్రహీరోల సినిమాలు వస్తున్నాయంటే ప్రేక్షకులు భారీ ఆసక్తి నెలకొంటుంది. ఎంతో మందికి ఈ ఇద్దరూ ఆదర్శంగా నిలిచారు. ఒకరేమో తన స్టైల్‌ అండ్ స్వాగ్​తో సినీ ప్రేమికులను ఆకట్టుకుంటే.. మరొకరేమో భిన్నమైన పాత్రలు చేస్తూ మల్టీ టాలెంటెడ్​గా క్రేజ్​ దక్కించుకున్నారు.

వీరిద్దరి సినిమాలు అన్నీ భాషలతో పాటు తెలుగు లోనూ రిలీజై ఆకట్టుకుంటుంటాయి. కానీ తెలుగులో వీరిద్దరికి చాలా కాలంగా సరైన గట్టి హిట్​ లేక సతమతమయ్యారు. అయితే కమల్​ రీసెంట్​గా విక్రమ్​ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్​ హిట్​ అందుకుని మళ్లీ ఫామ్​లోకి వచ్చేశారు. అంతకుముందు ఎప్పుడో 2013లో విశ్వరూపంతో హిట్​ అందుకున్నారు. ఈ సినిమా అభిమానులు బాగా ఆకట్టుకుంది. కానీ ఆ తర్వాత ఆయన చేసిన ఉత్తమ విలన్, చీకటి రాజ్యం వంటి సినిమాలు బోల్తా కొట్టాయి. ఒక్క పాపనాశం మాత్రమే హిట్ అయింది. ఆ సక్సెస్​ కూడా కోలీవుడ్​ వరకే పరిమితమైంది.

అలాంటి సమయంలో ఆయన లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్​ సినిమాతో వచ్చి పాన్ ఇండియా స్థాయి లో భారీ బ్లాక్ బాస్టర్​ను అందుకున్నారు. ఈ చిత్రం దేశవ్యాప్తంగా రూ.500కోట్ల వరకు వసూలు చేసింది. దీంతో ఒక్కసారిగా ఆయన నాలుగు చిత్రాల వరకు లైన్​లో పెట్టారు. దిగ్గజ దర్శకుడు శంకర్​తో ఇండియన్ 2, ప్రభాస్​తో కల్కి, యాక్షన్ డైరెక్టర్​ హెచ్ వినోద్​తో ఓ సినిమా, మణిరత్నంతో మరో చిత్రాన్ని చేస్తున్నారు.

కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం ఇంకా సరైన హిట్ లేక ఆయన అభిమానులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. తెలుగులో ఆయన నటించిన ఎన్నో చిత్రాలు సపర్ హిట్​గా నిలిచాయి. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకున్నాయి. గత 20ఏళ్లలో చంద్రముఖి, శివాజి ది బాస్​, రోబో వంటి చిత్రాలతో బాక్సాఫీస్​ను షేక్ చేశారు. కానీ ఆయన చివరిసారిగా విజయాన్ని అందుకుంది 2010లో రోబో తోనే. ఆ తర్వాత తెలుగు లో ఒక్క హిట్​ కూడా దక్కలేదు. కొచ్చాడియన్​, కబాలి, లింగ, కాలా, రోబో 2.0, పేటా, దర్బాల్​, అన్నాత్తే అన్ని కమర్షియల్​ గా ఓకే అనిపించినప్పటికీ ఆయన రేంజ్​ కు తగ్గట్టు భారీ హిట్ దక్కలేదు.

ప్రస్తుతం ఆయన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'జైలర్' చిత్రంతో వస్తున్నారు. ఈ సినిమా కథ చూస్తుంటే కమల్ 'విక్రమ్' స్టైల్​లో భారీ యాక్షన్ థ్రిల్లర్​గా కనిపిస్తోంది. ఈ సినిమాతో రజినీ గట్టి కమ్​ బ్యాక్ ఇస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. కమల్​కు 'విక్రమ్'​ ఎలా టర్నింగ్ పాయింట్ అయిందో రజనీకి కూడా 'జైలర్'​ అలాగే టర్నింగ్ పాయింట్ అవుతుందని గట్టిగా భావిస్తున్నారు. ఆగస్ట్​ 10న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.