రజనీ 'కూలీ' ఎంతో ఊహించగలరా?
దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం దేశంలో ఖరీదైన చిత్రాలలో ఒకటి.
By: Tupaki Desk | 8 May 2025 2:30 PMసూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న 'కూలీ' ఆగస్టు 14న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. లోకేష్ మార్క్ విజువలైజేషన్ తో ఈ మూవీ ఆద్యంతం యాక్షన్ ప్రియులను రక్తి కట్టించనుంది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం కాస్ట్ అండ్ క్రూ అందుకుంటున్న పారితోషికాలు చర్చగా మారాయి.
రజనీ ఇప్పటికే 500 కోట్ల క్లబ్ హీరో. దానికి తగ్గట్టే పారితోషికం అత్యంత భారీగా అందుకుంటున్నాడని కథనాలొస్తున్నాయి. కూలీ చిత్రం కోసం రజనీకాంత్ 260-280 కోట్లు అందుకుంటున్నారని, ఆసియాలోనే పారితోషికంలో నంబర్ వన్ స్టార్ అని ప్రచారం సాగుతోంది. అలాగే లోకేష్ కనగరాజ్ ఈ చిత్రం కోసం అత్యధికంగా 60 కోట్ల పారితోషికం అందుకుంటున్నారని సమాచారం.
దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం దేశంలో ఖరీదైన చిత్రాలలో ఒకటి. ఇందులో మెజారిటీ భాగం హీరో- దర్శకుడి పారితోషికం రూపంలోనే ఖర్చవుతోంది. ఈ యాక్షన్ డ్రామాలో నాగార్జున సైమన్ పాత్రలో నటించారు. దీనిలో కీలక పాత్రలో నటిస్తున్న తెలుగు సీనియర్ నటుడు నాగార్జునకు 35 కోట్ల పారితోషికం చెల్లిస్తున్నారని తెలుస్తోంది.
ఈ చిత్రంలో శ్రుతి హాసన్, సత్యరాజ్, ఉపేంద్ర ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు. వారు తమ సాధారణ మార్కెట్ కి తగ్గట్టే పారితోషికాన్ని అందుకుంటున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూడా ఈ చిత్రంలో ప్రత్యేక అతిధి పాత్రలో కనిపిస్తారు. అతడికి రూ.25-30 కోట్లు పారితోషికం ఇస్తున్నట్లు గుసగుస వినిపిస్తోంది. ఇందులో ప్రత్యేక గీతంలో నర్తించిన పూజా హెగ్డే 2 కోట్లు వసూలు చేస్తోందని సమాచారం. నిర్మాతలు ఇటీవల సినిమా ప్రీమియర్కు 100 రోజుల కౌంట్డౌన్ ప్రారంభమైందని ప్రకటించారు. టీజర్ ఇంటర్నెట్ లో వైరల్ అయింది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.