థియేటర్స్ బంద్ చిన్న విషయం కాదు.. ఎవరో మిస్ గైడ్ చేసి..: రాజేంద్ర ప్రసాద్
సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇప్పుడు షష్టిపూర్తి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
By: Tupaki Desk | 28 May 2025 10:07 AMసీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇప్పుడు షష్టిపూర్తి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 38 ఏళ్ల తర్వాత అర్చన తో కలిసి ప్రధాన పాత్రల్లో నటించగా, రూపేశ్- ఆకాంక్ష సింగ్ కీలకపాత్రల్లో యాక్ట్ చేశారు. మే 30వ ఆ సినిమా రిలీజ్ కానుండగా, మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఆ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.
ఆ సమయంలో థియేటర్స్ బంద్, పవన్ ప్రకటనకు సంబంధించిన అడిగిన ప్రశ్నకు రాజేంద్రప్రసాద్ స్పందించారు. "నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం.. అది మిస్ గైడ్ అయింది. థియేటర్స్ మూసివేయడం చిన్న విషయం కాదు కదా. థియేటర్స్ ఒకరు తీసుకున్న నిర్ణయం కాదు. ఒకరు చెబితే చేసేది కాదు. సమష్టిగా తీసుకోవాల్సిన నిర్ణయం" అని చెప్పారు.
"కానీ అనవసరంగా ఎవరో మిస్ గైడ్ చేశారు. తప్పుడు విధానంలో న్యూస్ బయటకు వచ్చింది. కానీ చివరకు ఏమైంది.. అది నిలబడలేదు కదా.. మా పవన్ కళ్యాణ్ ఫీల్ అయ్యాడంటే.. తను జెన్యూన్. నా సినిమా రిలీజ్ ముందు ఎందుకిలా అయిందని ఫీలయ్యాడు. అందుకే దాని వెనుక ఉన్న కారకులను పట్టుకోవాలి" అని ఆయన చెప్పారు.
"అప్పుడే సమస్య క్లియర్ అవుతుంది. కారకులను పట్టుకుని ఎందుకు జరిగిందో తెలుసుకోవాలి. అది మీరు (మీడియా వాళ్లు) పట్టుకుంటారు. నాకు తెలిసి.. సడెన్ గా రన్నింగ్ థియేటర్స్ జూన్ 1 నుంచి బంద్ అంటూ ప్రకటన అంటే చిన్నది కాదు.. అలా ఎప్పుడూ ఇంకోసారి జరగకూడదని నేను కోరుకుంటున్నా" అని తెలిపారు.
"48 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉండి.. ఆ పిచ్చి డిసిషన్ తీసుకోవడం.. ఎవరో అన్నారు.. ఎవరో అన్నారని అనడం కరెక్ట్ కాదు. మీకు ఎవరో చెప్పి ఉంటారు.. మీకు న్యూస్ కావాలి బట్టి మీరు అది వార్తగా వేశారు. దీంతో క్వశ్చన్ మార్క్ అయింది. పవన్ అందుకే బాధ్యతగా తీసుకుని ఎందుకలా జరిగిందో కనిపెట్టాలని చెప్పారు" అని పేర్కొన్నారు.
"పవన్ ఇప్పుడు డిప్యూటీ సీఎం.. పబ్లిక్ కు ఆన్సర్ ఇచ్చే బాధ్యత గల పొజిషన్ లో ఆయన ఉన్నారు.. అందుకే తెలుసుకోవాల్సిన బాధ్యత పవన్ కు ఉంది. అందుకే కనుక్కోండి.. ఆపండి.. అని అధికారులకు చెప్పారు. ఏదేమైనా ఇదంతా ఎందుకు జరిగిందో నాకు తెలియదు. కానీ ఇంకోసారి ఇలా జరగకూడదు" అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.