ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా అలా చూడలేదు
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా షష్టిపూర్తి. రూపేష్, ఆకాంక్ష సింగ్, అర్చన ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
By: Tupaki Desk | 28 May 2025 2:30 PMనటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా షష్టిపూర్తి. రూపేష్, ఆకాంక్ష సింగ్, అర్చన ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొచ్చిన రాజేంద్ర ప్రసాద్ సినిమా గురించి పలు విషయాలను షేర్ చేసుకున్నారు. తాను ఇండస్ట్రీలో 48 ఏళ్లుగా కొనసాగుతున్నానని, ఇన్నేళ్లుగా తనకు సపోర్ట్ చేస్తున్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పిన ఆయన, తనకెప్పుడూ తన వయసుకు తగ్గ పాత్రలే వస్తుంటాయని, అది తన అదృష్టమని, షష్టిపూర్తి సినిమా కచ్ఛితంగా గొప్ప మూవీ అవుతుందని గుండె మీద చేయి వేసుకుని చెప్తున్నానని, ఈ సినిమా తనకెంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు.
షష్టిపూర్తి సినిమా ప్రతీ ఇంట్లో జరిగే కథ అని, ఈ సినిమా ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఒకప్పుడు తాను కూడా నిర్మాతగా పలు సినిమాలు తీశానని, కానీ అప్పటికీ ఇప్పటికీ నిర్మాణంలో చాలా మార్పులొచ్చాయని, ఇప్పుడున్నంత టెక్నాలజీ అప్పుడు లేదని, ఇప్పుడున్నంత డిస్ట్రబెన్స్ కూడా అప్పట్లో లేదని చెప్పారు. తానిప్పటికీ షాట్ చేశాక మానిటర్ చూడనని, మానిటర్ చూసుకుని వన్స్ మోర్ అని చెప్పాల్సింది డైరెక్టర్ అని, ఎవరి పని వాళ్లు చేసుకుంటేనే బావుంటుందని అన్నారు.
థియేటర్లు మూసేయడం అనేది ఒకరి డెసిషన్స తో జరిగే పని కాదని, ఈ విషయంలో అందరూ కలిసి కట్టుగా ఉండి నిర్ణయం తీసుకోవాలని, కానీ ఆ వార్త తప్పుగా బయటికొచ్చిందని, అందుకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకుని విచారణకు ఆదేశించారని ఆయన చెప్పారు. తాను ఇంగ్లీష్ లో క్విక్ గన్ మురుగన్ అనే సినిమాలో యాక్ చేశానని, ఆల్రెడీ అందులో నుంచి మూడు పార్టులు రావాల్సి ఉండగా, సెకండ్ పార్ట్ త్వరలోనే రిలీజ్ కాబోతుందని, ఏఐ ను వాడి అందులో కొన్ని సీన్స్ ను తీయబోతున్నారని చెప్పారు. ఒక సినిమాలో తాను నటిస్తే ఆ పాత్రకు ప్రాధాన్యం వస్తుందంటే కచ్ఛితంగా చేస్తానని చెప్పిన ఆయన తాను ఏ క్యారెక్టర్ చేసినా అది ఆడియన్స్ కు గుర్తిండిపోవాలనేది తన ఫార్ములా అని చెప్పారు.
ఇండస్ట్రీలో ఇది తన ఐదో జెనరేషన్ అని, ఇప్పటికీ తన కోసం షష్టిపూర్తి లాంటి క్యారెక్టర్లు రాస్తున్నారంటే అదంతా తన అదృష్టమని, పిల్లలు తల్లిదండ్రుల పెళ్లిని చూడలేరు. కానీ షష్టిపూర్తిని మాత్రం చూడగలరు అందుకే దానికంత ప్రాధాన్యమని, ఇలాంటి సినిమాలను అసలు మిస్ అవకూడదని ఆయనన్నారు. కళ సముద్రం లాంటిదని, యాక్టర్ గా ఇంకెన్నో పాత్రలు చేయాలని ఉంటుందని, షష్టిపూర్తి సినిమాలో మూడు రకాల వేరియేషన్స్ ఉన్నాయని, ఈ మూడు ఏజ్ గ్యాప్ల్లో నటించడం ఎంతో ఛాలెంజింగ్ గా అనిపించిందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో మీ స్పెషాలిటీ ఏంటని తనను అన్న ఎన్టీఆర్ అడిగారని దాంతో తాను వారం రోజుల పాటూ ఆలోచించానని, ఒక్కొక్కరికి ఒక్కో మార్క్ ఉన్నట్టు రొమాంటిక్ హీరో, యాక్షన్ హీరోలా కామెడీ హీరో ఎందుకు ఉండకూడదనిపించిందని, దాంతో అప్పట్నుంచి కామెడీ ప్రాధాన్యమున్న సినిమాలే చేయాలని కామెడీ హీరోగా నిలదొక్కుకోవాలని ట్రై చేశానని, లేడీస్ టైలర్ తర్వాత నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకున్నది లేదని ఆయన చెప్పారు. తన లైఫ్ లో తాను డబ్బు గురించి ఎప్పుడూ ఆలోచించలేదని, చేస్తున్న పని సంతృప్తినిచ్చిందా లేదా అన్నదే చూస్తానని, దేవుడి దయ వల్ల ఇప్పటికీ పని దొరుకుతుందని, ఇప్పుడు తన చేతిలో 11 సినిమాలున్నాయని, మరో నాలుగు సినిమాలు డిస్కషన్స్ లో ఉన్నాయని ఆయన అన్నారు.
అర్చనతో కలిసి లేడీస్ టైలర్ తర్వాత ఇన్నేళ్లకు పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పిన ఆయన, ప్రస్తుత కాలంలో కామెడీ తగ్గిందని, తమ టైమ్ లో రైటర్లు మంచి కామెడీని రాసేవారని, ఆ రోజుల్లో ఉన్న కామెడీ టైమింగ్, రైటింగ్ ఈ రోజుల్లో కనిపించడం లేదని ఇప్పుడు మంచి కామెడీ ఇప్పుడు మస్ అవుతుందని బాధగా అనిపిస్తుందని, అహ నా పెళ్లంట సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత ఎంతో భయమేసిదని, మళ్లీ అలాంటి సినిమా వస్తుందా అనిపించిందని ఆయన అన్నారు.