Begin typing your search above and press return to search.

నాలుగు ద‌శాబ్ధాల‌కు న‌ట‌కిరీటీ మ‌ళ్లీ ఆమెతో!

స్టార్ హీరో సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా న‌టించ‌డం..ప్ర‌ధాన పాత్ర‌లు పోషిండ‌చం అన్న‌ది నిరంత‌రం జ‌రిగే ఓ ప్ర‌క్రియ లాంటింది

By:  Tupaki Desk   |   29 May 2025 1:30 PM
నాలుగు ద‌శాబ్ధాల‌కు న‌ట‌కిరీటీ మ‌ళ్లీ ఆమెతో!
X

న‌ట కిరీటీ రాజేంద్ర ప్ర‌సాద్ నిత్యం ఏదో సినిమాతో బిజీగా ఉండే న‌టుడు. స్టార్ హీరో సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా న‌టించ‌డం..ప్ర‌ధాన పాత్ర‌లు పోషిండ‌చం అన్న‌ది నిరంత‌రం జ‌రిగే ఓ ప్ర‌క్రియ లాంటింది. ఇప్ప‌టి వ‌ర‌కూ అవ‌కాశాలు లేక ఖాళీగా ఉన్నారు? అనే మాట ఆయ‌న డిక్ష‌న‌రీలో లేదు. చిన్న‌దో...పెద్ద‌దో ఏదో సినిమా చేయ‌డం ఆయ‌న‌కు అల‌వాటు. న‌టుడు అన్నాక అన్ని ర‌కాల పాత్ర‌లు పోషించాలి అన్న‌ది ఆయ‌న సిద్దాంతం కూడా.

తాజాగా `ష‌ష్టిపూర్తి` సినిమాలో ఆయ‌న ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఇందులో సీనియ‌న్ న‌టి అర్చ‌న కూడా న‌టిస్తున్నారు. అయితే ఇద్ద‌రు ఇలా క‌లిసి న‌టించ‌డం అన్న‌ది నాలుగు ద‌శాబ్ధాల త‌ర్వాత చోటు చేసుకున్న స‌న్నివేశ‌మ‌ని ఎంత మంది తెలుసు. అవును ఇది నిజ‌మే. రాజేంద్ర ప్ర‌సాద్- అర్చ‌న 40 ఏళ్ల క్రితం వంశీ తెర‌కెక్కించిన `లేడీస్ టైల‌ర్` అనే సినిమాలో న‌టించారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ క‌లిసి న‌టించలేదు.

అలాంటి అవ‌కాశం రాక‌పోవ‌డంతో ఇది సాధ్య‌ప‌డ‌లేదు. మ‌ళ్లీ `ష‌ష్టిపూర్తి` కార‌ణంగానే ఈ అరుదైన ఘ‌ట్టం చోటు చేసుకుంది. దీంతో చాలా కాలం త‌ర్వాత ఇద్ద‌ర్ని వెండి తెర‌పై చూసే అవ‌కాశం పాత త‌రం అభిమానుల‌కు ద‌క్కుతుంది. అప్ప‌టి నటీనటులంతా ఎంతో స‌హ‌జంగా న‌టించేవారు. పాత్ర‌ల‌కు జీవం పోసేవారు. వాస్తవ జీవితాలే తెర‌పై క‌నిపించేవి. అందులోనూ వంశీ సినిమాల్లో వాస్త‌విక‌త, హాస్యం ఉట్టి ప‌డేది.

మ‌రి `ష‌ష్టిపూర్తి`లో రాజేంద్ర ప్ర‌సాద్- అర్చ‌న జోడీ ఎలా ఆక‌ట్టుకుంటుందో చూడాలి. ఇందులో రూపేష్ - ఆకాంక్ష సింగ్ జంట‌గా న‌టించారు. ఆకాంక్ష సింగ్ మంచి పెర్పార్మ‌ర్ గా గుర్తింపు ఉంది. `మ‌ళ్లీరావే` చిత్రంలో ఎలాంటి పెర్పార్మెన్స్ ఇచ్చిందో తెలిసిందే. అమ్మ‌డు గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు దూరంగా ఉంటూ డీసెంట్ పాత్ర‌లు మాత్ర‌మే పోషిస్తుంది. ఆ ర‌కంగా కెరీర్ లో వెనుక‌బ‌డింది.