Begin typing your search above and press return to search.

రాజాసాబ్.. ఇలా ఇంకెన్ని రోజులో..

ఈ మూవీ నుంచి త్వరలో ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయడానికి ప్లాన్ జరుగుతుందని సోషల్ మీడియాలో విస్తృతంగా వినిపించిన మాట.

By:  Tupaki Desk   |   18 April 2024 4:03 AM GMT
రాజాసాబ్.. ఇలా ఇంకెన్ని రోజులో..
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలని లైన్ లో పెట్టారు. ప్రతి సినిమా 300 కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్నవే కావడం విశేషం. ఇండియాలోనే హైయెస్ట్ మార్కెట్ ఉన్న హీరోగా ప్రస్తుతం ప్రభాస్ ఉన్నాడు. అతని సినిమాలకి భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి. ప్రభాస్ చేతిలో ఐదు సినిమాల వరకు ఉంటే అందులో లో బడ్జెట్ తో తెరకెక్కుతోన్న మూవీ రాజాసాబ్.

ఈ సినిమా బడ్జెట్ 150 కోట్ల వరకు ఉంటుందని టాక్ వినిపిస్తోంది. మారుతి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే మూవీ రెగ్యులర్ షూటింగ్ తాజాగా హైదరాబాద్ లో మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఈ షూటింగ్ లో ప్రభాస్ తో పాటుగా హీరోయిన్ నిధి అగర్వాల్ పాల్గొన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరికి సంబందించిన కీలక సన్నివేశాలని ప్రస్తుతం షూట్ చేస్తున్నారు.

మూవీలో నిధి అగర్వాల్ తో పాటుగా మాళవిక మోహనన్, రిద్ధి కుమారి కూడా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హర్రర్ కామెడీ జోనర్ లో ఈ సినిమా కథ ఉండబోతోందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. స్టోరీ మొత్తం ఒక భవంతి నేపథ్యంలోనే నడుస్తుందంట. దీనికోసం ప్రత్యకంగా వింటేజ్ స్టైల్ భవనం సెట్ కూడా వేశారు. దీంట్లోనే మూవీ షూటింగ్ జరుగుతోంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక టాక్ ప్రచారంలోకి వచ్చింది. ఈ మూవీ నుంచి త్వరలో ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయడానికి ప్లాన్ జరుగుతుందని సోషల్ మీడియాలో విస్తృతంగా వినిపించిన మాట. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదంట. ఇప్పట్లో మూవీకి సంబంధించి ఎలాంటి సాంగ్స్, టీజర్ రిలీజ్ చేసే అవకాశం లేదంట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పైన మారుతి ఫోకస్ అంతా ఉందని చిత్ర యూనిట్ నుంచి వినిపిస్తోన్న మాట. అలాగే కల్కి రిలీజ్ ఉంది కాబట్టి ఆ సినిమా తరువాతే రాజా సాబ్ సౌండ్ స్టార్ట్ అవుతుందట.

వీలైనంత వేగంగా మూవీ షూటింగ్ కంప్లీట్ చేయడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేయాలని మారుతి అనుకుంటున్నారంట. వచ్చే ఏడాది సంక్రాంతి టార్గెట్ గా ఈ సినిమాని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ప్రభాస్ తాతయ్యగా కనిపిస్తాడంట. అలాగే సత్యరాజ్ ఓ కీలక పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని మారుతి రెడీ చేస్తున్నట్లు టాక్.