Begin typing your search above and press return to search.

రాజాసాబ్.. బయ్యర్లకు ముందుగానే..

అలాగే ఆగష్టు నుంచి రాజాసాబ్ మూవీ బిజినెస్ స్టార్ట్ చేసే ప్లాన్ లో నిర్మాత ఉన్నారంట. బయ్యర్లు కూడా ఈ మూవీ రైట్స్ కోసం పోటీ పడుతున్నారు.

By:  Tupaki Desk   |   26 April 2024 5:10 AM GMT
రాజాసాబ్.. బయ్యర్లకు ముందుగానే..
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. హర్రర్ కామెడీ జోనర్ లో ఈ సినిమా సిద్ధం అవుతోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడీగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. రిద్ధి కుమార్ మరో కీలక పాత్రలో కనిపించబోతోంది.

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ఈ చిత్రంలో ప్రభాస్ తాతయ్యగా కనిపిస్తాడంట. అలాగే సత్యరాజ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ప్రభాస్, నిధి అగర్వాల్ మధ్యలో కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారంట. మారుతి కెరియర్ లో భారీ బడ్జెట్ తో చేస్తోన్న సినిమా కావడంతో చాలా జాగ్రత్తగా మూవీ చిత్రీకరణ జరుపుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ మూవీని వీలైనంత వేగంగా కంప్లీట్ చేసి సంక్రాంతి కానుకగా తీసుకురావాలని నిర్మాత విశ్వప్రసాద్ అనుకుంటున్నారంట. గతంలో కూడా విశ్వంభర పోటీలో లేకపోతే రాజాసాబ్ ని సంక్రాంతికి రిలీజ్ చేస్తామని నిర్మాత తెలియజేశారు. ఇప్పుడు సంక్రాంతి రిలీజ్ విషయంలో నిర్మాత ఫిక్స్ అయినట్లు ప్రచారం నడుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే బయ్యర్లకి కూడా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి సమాచారం చేరిపోయిందని టాక్ వినిపిస్తోంది.

అలాగే ఆగష్టు నుంచి రాజాసాబ్ మూవీ బిజినెస్ స్టార్ట్ చేసే ప్లాన్ లో నిర్మాత ఉన్నారంట. బయ్యర్లు కూడా ఈ మూవీ రైట్స్ కోసం పోటీ పడుతున్నారు. ఒక వేళ సంక్రాంతి రేసులో రాజాసాబ్ మూవీ ఉంటే మాత్రం కచ్చితంగా మిగిలిన సినిమాలకి పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఈ ఏడాది ఈగల్ సినిమాని విశ్వప్రసాద్ సంక్రాంతికి రిలీజ్ చేద్దామని అనుకున్నారు. అయితే రేసులో పోటీ ఎక్కువ ఉండటంతో మిగిలిన నిర్మాతల రిక్వెస్ట్ మేరకు వెనక్కి తగ్గారు.

2025 సంక్రాంతికి మాత్రం రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావాలనే నిర్ణయంతో విశ్వప్రసాద్ ఉన్నారనే ప్రచారం ఇండస్ట్రీలో నడుస్తోంది. ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసే వరకు వెయిట్ చేయాలి. మారుతి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కి ఎంత టైం పడుతుందనేదానిని బట్టి మూవీ రిలీజ్ ఆధారపడి ఉండొచ్చని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. రాజాసాబ్ సినిమాతో మలయాళీ బ్యూటీ మాళవిక మోహనన్ టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. మూవీపై ఈ అమ్మడు చాలా హోప్స్ పెట్టుకుంది.