Begin typing your search above and press return to search.

ఆ దర్శకులను చూసి భయపడిన రాజమౌళి

ఇదిలా ఉంటే జక్కన్న ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన నెక్స్ట్ సినిమా ప్లాన్ చేసుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   6 Jan 2024 4:09 AM GMT
ఆ దర్శకులను చూసి భయపడిన రాజమౌళి
X

ప్రస్తుతం టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజమౌళి పాన్ ఇండియా రేంజ్ లో తన హవా కొనసాగిస్తున్నారు. ఇండియా నుంచి మొట్టమొదటి ఆస్కార్ అవార్డు అందుకున్న సినిమా దర్శకుడిగా రాజమౌళి ఇప్పటికే అరుదైన గౌరవం సొంతం చేసుకున్నాడు. ఇండియన్ స్టైల్ మాస్ కమర్షియల్ సినిమాలకి కూడా ఆస్కార్ అవార్డులు వస్తాయని ఆర్ఆర్ఆర్ తో ప్రూవ్ చేశాడు. ఇదిలా ఉంటే జక్కన్న ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన నెక్స్ట్ సినిమా ప్లాన్ చేసుకుంటున్నారు.

అయితే రాజమౌళి ఈ స్థాయిలోకి వెళ్ళిన కొంతమంది దర్శకులని రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే బ బాహుబలి కంటే ముందు ఓ ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ లో సుకుమార్, త్రివిక్రమ్ ఎక్కువగా క్లాస్ టచ్ ఉన్న సినిమాలనే చేశారు.

అయితే ఇండస్ట్రీలో కరెక్ట్ గా ఫోకస్ చేసి మాస్ చిత్రాలు చేస్తే మనం సర్దుకోవాల్సిందే అనిపించే దర్శకులు సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్ అని ఆ ఇంటర్వ్యూలో జక్కన్న చెప్పుకొచ్చారు. వారిద్దరి దగ్గర చాలా స్టఫ్ ఉందని, అదృష్టం బాగుండి వారు మాస్ సినిమాలు చేయడం లేదంటూ రాజమౌళి చెప్పడం విశేషం. జక్కన్న చెప్పిన దర్శకులలో ఇప్పటికే సుకుమార్ రంగస్థలం, పుష్ప సినిమాలతో మాస్ కమర్షియల్ సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అరవింద సమేతతో మాస్ సినిమా చేశాడు. అయితే దానికి అక్కడక్కడ తన క్లాస్ ఫ్లేవర్ జోడించాడు. కాని ఈ సారి గుంటూరు కారం సినిమాని కంప్లీట్ మాస్ కమర్షియల్ చిత్రంగానే ఆవిష్కరిస్తున్నట్లు పోస్టర్స్, సాంగ్స్ చూస్తుంటే క్లారిటీ వచ్చేస్తుంది. సినిమా అద్భుతంగా వచ్చిందని నిర్మాత నాగవంశీ కూడా ప్రతిసారి చెబుతున్నాడు.

ఈ మూవీ సూపర్ హిట్ అయితే మాత్రం జక్కన్న చెప్పిన ఆ ఇద్దరు దర్శకులు నిజంగానే మాస్, కమర్షియల్ సినిమాలలో బెస్ట్ అని ప్రూవ్ అయిపోతుంది. సుకుమార్ అయితే ఇప్పటికే రాజమౌళి చెప్పింది కరెక్ట్ ని రుజువు చేశారు. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాతో నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు.