Begin typing your search above and press return to search.

SSMB29: మహేష్ మూవీపై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్డేట్!

ఈ వేడుక అనంతరం అక్కడి రాజకీయ నాయకులతో మాట్లాడారు రాజమౌళి. ఆ సందర్భంలో మహేశ్‌ బాబుతో సినిమా గురించి ఆయన కామెంట్స్ చేశారు.

By:  Tupaki Desk   |   1 March 2024 1:39 PM GMT
SSMB29: మహేష్ మూవీపై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్డేట్!
X

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్‌ బాబు కాంబినేషన్ లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి అందరికీ తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్, త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక దీనికి సంబంధించిన ఏ చిన్న రూమర్ వచ్చినా వచ్చినా అది క్షణాల్లోనే వైరల్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలో మహేష్ సినిమా గురించి రాజమౌళి తాజాగా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

రాజమౌళి ఇటీవల కర్ణాటకలోని బళ్లారిలో అమృతేశ్వర ఆలయ ప్రారంభోత్సవానికి వెళ్లిన సంగతి తెలిసిందే. 'ఈగ' నిర్మాత వారాహి చలన చిత్ర సాయి కొర్రపాటి నిర్మించిన ఈ ఆలయంలో నిర్వహించిన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో దర్శకుడు తన సతీమణితో కలిసి పాల్గొన్నారు. ఈ వేడుక అనంతరం అక్కడి రాజకీయ నాయకులతో మాట్లాడారు రాజమౌళి. ఆ సందర్భంలో మహేశ్‌ బాబుతో సినిమా గురించి ఆయన కామెంట్స్ చేశారు. త్వరలోనే ఈ చిత్రాన్ని పట్టలెక్కించనున్నట్లు తెలిపారు.

' నెక్స్ట్ మూవీ మహేశ్‌ బాబుతో చేస్తున్నాను. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతోంది' అని రాజమౌళి అన్నారు. ఈ చిత్రానికి ''మహారాజా", "చక్రవర్తి" వంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తుండగా.. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదని దర్శకుడు తెలిపారు. జక్కన్న మాట్లాడిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీంతో SSMB29, రాజమౌళి, మహేష్ బాబు హ్యష్ టాగ్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చాయి.

మహేష్ - రాజమౌళి కాంబినేషన్ లో ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ తెరకెక్కనుంది. దీని కోసం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌, రచయిత ఎస్ ఎస్ కాంచి కలిసి ఇప్పటికే కథను సిద్ధం చేశారు. మహేశ్‌ ఎంతో ఇంటెన్సిటీ ఉన్న యాక్టర్ అని.. తన కోసం సాహసోపేతమైన స్టోరీని రెడీ చేస్తున్నట్లుగా విజయేంద్ర ప్రసాద్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇది ఇండియానా జోన్స్ తరహాలో రూపొందే గ్లోబ్ ట్రాటనింగ్ సినిమా అని దర్శకుడు తెలిపారు.

SSMB29 మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి కెరీర్ లోనే కాదు, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా మారనుంది. RRR వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకధీరుడి నుంచి రాబోతున్న ఈ సినిమాపై అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి గ్లోబల్ బాక్సాఫీస్ షేక్ అవ్వడం గ్యారంటీ సినీ అభిమానులు భావిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే చిత్ర బృందం భారీ స్ధాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.

రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు ఆల్రెడీ కసరత్తులు మొదలు పెట్టారు. ఎన్నడూ లేనటువంటి మేకోవర్ తో, సరికొత్త లుక్ లోకి మారడానికి కృషి చేస్తున్నారు. ఇందులో సూపర్ స్టార్ సరసన ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ హీరోయిన్‌గా నటించనుందని.. హాలీవుడ్‌ ప్రముఖ నటుడు క్రిస్‌ హెమ్స్‌వర్త్‌ కీలక పాత్ర పోషిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. సినిమాటోగ్రాఫర్ మినహా రాజమౌళి గత చిత్రాలకు వర్క్ చేసిన టెక్నికల్ టీమ్ అంతా ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో భాగం అవుతారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.