Begin typing your search above and press return to search.

RRR టీమ్‌తో రాజ‌మౌళి దిల్లీకి!

తాజా స‌మాచారం మేర‌కు.. ఆర్.ఆర్.ఆర్ దర్శకుడు SS రాజమౌళి, MM కీరవాణి, SS కార్తికేయ త‌దిత‌రులు కూడా ఈవెంట్‌ను తిలకించడానికి న్యూఢిల్లీకి చేరుకున్నారు.

By:  Tupaki Desk   |   16 Oct 2023 5:25 PM GMT
RRR టీమ్‌తో రాజ‌మౌళి దిల్లీకి!
X

ఆగస్ట్‌లో 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను అధికారికంగా ప్రకటించారు. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్త‌మ న‌టుడిగా జాతీయ అవార్డుకు ఎంపిక‌య్యారు. 'పుష్ప: ది రైజ్‌'లో అత్యుత్తమ నటనకు గాను ఉత్తమ నటుడి విభాగంలో జాతీయ అవార్డును గెలుచుకున్న మొదటి తెలుగు నటుడు బ‌న్ని. మరోవైపు గ్లోబల్ సంచలనం RRR ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం, సంపూర్ణ వినోదాన్ని అందించిన సినిమాగా, ఉత్త‌మ‌ నేపథ్య సంగీతం, ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్, ఉత్తమ కొరియోగ్రఫీ, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్‌లు వంటి విభాగాలలో అనేక జాతీయ అవార్డులను కూడా గెలుచుకుంది.

17 అక్టోబ‌ర్ న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరగనున్న 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యేందుకు బయలుదేరిన అల్లు అర్జున్ అతని భార్య అల్లు స్నేహ రెడ్డి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కనిపించిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. పుష్ప టీమ్ తో పాటు ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ టీమ్ కూడా దిల్లీ వెళ్లిన ఫోటోలు వెబ్ లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి.

తాజా స‌మాచారం మేర‌కు.. ఆర్.ఆర్.ఆర్ దర్శకుడు SS రాజమౌళి, MM కీరవాణి, SS కార్తికేయ త‌దిత‌రులు కూడా ఈవెంట్‌ను తిలకించడానికి న్యూఢిల్లీకి చేరుకున్నారు. పుష్ప‌- ఆర్.ఆర్.ఆర్ టీమ్ లు వేదిక‌పై పుర‌స్కారాల్ని అందుకోవ‌డం చూసేందుకు అభిమానులు ఆస‌క్తిగా ఉన్నారు. వారు న్యూఢిల్లీకి బయలుదేరిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తారలు తమ అవార్డులను ప్రత్యక్షంగా అందుకోవడం కోసం టాలీవుడ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.