Begin typing your search above and press return to search.

మహేష్ ఫ్యాన్స్ ని హర్ట్ చేసిన రాజమౌళి..!

కానీ ఫ్యాన్స్ ని నిరాశ పరుస్తూ అటు రాజమౌళి, ఇటు మహేష్ ఇద్దరు తమ సినిమా ప్రస్తావనే తీసుకురాలేదు.

By:  Tupaki Desk   |   28 Nov 2023 9:27 AM GMT
మహేష్ ఫ్యాన్స్ ని హర్ట్ చేసిన రాజమౌళి..!
X

రణ్ బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన యానిమల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని మల్లారెడ్డి కాలేజ్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్, రణ్ బీర్ కపూర్ వచ్చారు. మహేష్ గుంటూరు కారం తర్వాత రాజమౌళి డైరెక్షన్ లోనే సినిమా చేస్తున్నారు. అయితే యానిమల్ ఈవెంట్ లో ఈ ఇద్దరు కలిసి రావడంతో సినిమా గురించి ఏదైనా అప్డేట్ ఇస్తారేమో అనుకున్నారు. కానీ ఫ్యాన్స్ ని నిరాశ పరుస్తూ అటు రాజమౌళి, ఇటు మహేష్ ఇద్దరు తమ సినిమా ప్రస్తావనే తీసుకురాలేదు.

రాజమౌళి మాట్లాడుతూ ఇండియాలో రణ్ బీర్ గొప్ప నటుడని అన్నారు. ఆర్జివి తర్వాత మళ్లీ ట్రెండ్ సెట్ చేసే డైరెక్టర్ గా సందీప్ వచ్చాడని అన్నారు. అయితే ఈలోగా యాంకర్ సుమ మహేష్ గారిని ఏదైనా ప్రశ్న అడుగుతారా అంటే లేదు దానికి ఇంకా టైం ఉందని అన్నారు. కనీసం మహేష్ పేరుని కూడా ప్రస్తావించకపోవడం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని హర్ట్ చేసింది. మరోపక్క మహేష్ కూడా అదే తీరు ప్రవర్తించారు.

రాజమౌళి సినిమా గురించి సుమ అడిగితే దానికి ఇంకా టైం పడుతుందని అన్నారు మహేష్. సో రాజమౌళి మహేష్ వస్తున్నారని అనౌన్స్ చేయగానే ఎస్.ఎస్.ఎం.బి 29 గురించి ఏదైనా స్పెషల్ అప్డేట్ ఉంటుందని అనుకున్న ఫ్యాన్స్ కి నిరాశ తప్పలేదు. మహేష్ బాబు ఏ ఈవెంట్ లో లేనంత ఉత్సాహంగా యానిమల్ ఈవెంట్ లో ఉన్నారు. సందీప్ రెడ్డితో కచ్చితంగా ఫ్యూచర్ లో మహేష్ సినిమా ఉంటుందని తెలుస్తుంది.

యానిమల్ ట్రైలర్ చూశాక మెంటల్ వచ్చేసిందని చెప్పిన మహేష్ రణ్ బీర్ కు తాను పెద్ద అభిమానినని అన్నారు. ఈ సినిమా తో రణ్ బీర్ తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఏర్పరచుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఆల్రెడీ బ్రహ్మస్త్ర సినిమా తెలుగులో మంచి ఫలితాన్ని అందించింది. ఈ సినిమా అంతకుమించి బ్లాక్ బస్టర్ అందుకునే అవకాశం కనిపిస్తుంది. యానిమల్ సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. యానిమల్ మేకర్స్ మాత్రం సినిమాపై పూర్తి నమ్మకంగా ఉన్నారు. సినిమా రన్ టైం పై సందీప్ రెండ్డి ఆడియన్స్ కు క్లారిటీ ఇచ్చారు. సినిమా రన్ టైం ఎక్కువ ఉన్నా అది కచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుందని అన్నారు.