రాజ్ "23" ట్రైలర్.. సినిమాపై అంచనాలు పెంచేలా..
మల్లేశం, 8 A.M మెట్రో చిత్రాలతో డైరెక్టర్ రాజ్ ఆర్.. ఆడియన్స్ ను అలరించిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 6 May 2025 4:41 PMమల్లేశం, 8 A.M మెట్రో చిత్రాలతో డైరెక్టర్ రాజ్ ఆర్.. ఆడియన్స్ ను అలరించిన విషయం తెలిసిందే. తన టాలెంట్ తో సినీ ప్రియులను మెప్పించారు. ఇప్పుడు నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన తెరకెక్కించిన మూవీ '23'.. ఇప్పుడు రిలీజ్ కు సిద్ధమవుతోంది.
రాజ్ ఆర్ రూపొందించిన ఆ సినిమాను టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి నేతృత్వంలోని స్పిరిట్ మీడియా సమర్పించగా.. స్టూడియో 99 గ్రాండ్ గా నిర్మించింది. తేజ, తన్మయి ప్రధాన పాత్రలు పోషించగా.. ఝాన్సీ, పావోన్ రమేష్, తాగుబోతు రమేష్, ప్రణీత్ వంటి పలువురు నటీనటులు ముఖ్యపాత్రల్లో నటించారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న మూవీ.. మే 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ లో మేకర్స్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు అదే జోష్ తో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ట్రైలర్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
అయితే మూడు నిజజీవిత విషాద ఘటనలతో కూడిన కథతో సినిమా రూపొందినట్లు ట్రైలర్ ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. 1991 చుండూరు ఊచకోత, 1993 చిలకలూరి పేట బస్సు అగ్నిప్రమాదం, 1997 జూబ్లీహిల్స్ కారు బాంబు దాడి ఘటనల ఆధారంగా సినిమా ఉండనున్నట్లు స్ఫష్టమవుతోంది.
కేవలం ఘటనలనే చూపించడం కాకుండా, వాటి వెనుక ఉన్న ఆందోళన, హింసకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా సినిమాను రాజ్ ఆర్ తీసినట్లు తెలుస్తోంది. సినిమాలో కథను వివరించడంలో తన మార్క్ ను క్లియర్ గా చూపిస్తారని ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. మూవీలో ప్రతి రోల్ కు తగిన ప్రాధాన్యత ఉన్నట్లు కనిపిస్తోంది.
ట్రైలర్ అందరినీ ఆకట్టుకుని సినిమాపై మంచి అంచనాలు పెంచుతోంది. నిజజీవిత ఘటనలను నెరేట్ చేస్తూ వచ్చిన డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లవ్ ట్రాక్ నేచురల్ గా ఉండి ఆకట్టుకుంటోంది. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ, మార్క్ కె రాబిన్ ఇంటెన్స్ మ్యూజిక్ ట్రైలర్ కు మెయిన్ అసెట్స్ గా నిలిచాయి. మరి మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.