Begin typing your search above and press return to search.

రాశి ఖన్నా.. ఈసారి కొట్టాల్సిందే పాప!

టాలీవుడ్ లో చివరగా పక్కా కమర్షియల్ సినిమాతో సందడి చేసిన బ్యూటీ.. ఆ తర్వాత ఇప్పటి వరకు కనిపించలేదు.

By:  Tupaki Desk   |   12 March 2024 4:30 PM GMT
రాశి ఖన్నా.. ఈసారి కొట్టాల్సిందే పాప!
X

ఢిల్లీ అమ్మాయి రాశీ ఖన్నా.. హిందీ మూవీ మద్రాస్ కేఫ్ తో నటిగా కెరీర్ స్టార్ చేసింది. మనం మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు హీరోయిన్ గా మారింది. అప్పటి నుంచి వరుస తెలుగు సినిమాల్లో నటించింది. మధ్యమధ్యలో ఓ మలయాళ, కొన్ని తమిళ చిత్రాలతో అలరించింది. ప్రస్తుతం నార్త్ లో తన సత్తా చాటుతోంది. ఇటీవల వెబ్ సిరీస్ లు రుద్ర, ఫర్జీతో ఆకట్టుకుంది.


టాలీవుడ్ లో చివరగా పక్కా కమర్షియల్ సినిమాతో సందడి చేసిన బ్యూటీ.. ఆ తర్వాత ఇప్పటి వరకు కనిపించలేదు. బాలీవుడ్ మూవీతో సినీ కెరీర్ స్టార్ట్ చేసిన రాశి.. పదేళ్ల తర్వాత మళ్లీ హిందీ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ఆమె యోధ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో గట్టి హిట్ కొట్టాలని రాశీ ఖన్నా భావిస్తోంది.

యోధ క్లిక్ అయితే.. రాశీ ఖన్నా కెరీర్ కు తిరుగుండదని సినీ పండితులు చెబుతున్నారు. బడా ప్రాజెక్టుల ఛాన్సులు దక్కించుకోనునుందని అంటున్నారు. అయితే రాశీ ఖన్నానే కాదు.. సిద్ధార్థ్ మల్హోత్రా కూడా గత కొంతకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన నటించిన థాంక్స్ గాడ్, జెంటిల్‌ మెన్, మార్జావాన్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు ఈ మూవీ పైనే ఆయన ఆశలు పెట్టుకున్నారు.

యోధ మూవీలో సిద్ధార్థ్ మల్హోత్రా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ రోల్ చేశారు. కమాండోగా భారీ యాక్షన్ సీక్వెన్స్ లు చేసినట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. రాశీ ఖన్నా ఎయిర్ పోర్ట్ ఆఫీసర్ రోల్ లో కనిపించనుందని తెలుస్తోంది. మరో హీరోయిన్ దిశా ఎయిర్ హోస్టెస్ గా కనిపించనున్నారు. సాగర్ అంబ్రే, పుష్కర్ ఓఝా దర్శకులుగా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మించగా.. అపూర్వ మెహతా, శశాంక్ ఖైతాన్ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. కరణ్ జోహార్ వంటి బడా నిర్మాతలు యోధకు మద్దతు ఇవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. మరి ఈ సినిమా అటు సిద్ధార్థ్ మల్హోత్రాతో పాటు ఇటు రాశీ ఖన్నాకు ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.