Begin typing your search above and press return to search.

గంగమ్మ తల్లి జాతర.. బన్నీ డెడికేషన్ చూడండి!

ఇటీవల 'పుష్ప 2' సెట్స్ నుంచి జాతర సన్నివేశాల షూటింగ్ కు సంబంధించి, అల్లు అర్జున్ ఫోటోని ఆయన అభిమాని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

By:  Tupaki Desk   |   10 Feb 2024 12:09 PM GMT
గంగమ్మ తల్లి జాతర.. బన్నీ డెడికేషన్ చూడండి!
X

2024 మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాలలో 'పుష్ప 2' ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ మువీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక ఎప్పటికప్పుడు బయటకు వస్తున్న ఈ సినిమా సంగతులు, లీకవుతున్న ఫోటోలు ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాయి.

'పుష్ప: ది రూల్' ఫస్ట్ లుక్ పోస్టర్ లో అమ్మవారి గెటప్ లో కనిపించి ఇండియా వైడ్ సంచలనం సృష్టించారు అల్లు అర్జున్. ఇది సినిమాలో గంగమ్మ తల్లి జాతరలో భాగంగా వచ్చే సన్నివేశం అని అర్థమైంది. ఈ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని, అల్లు అర్జున్ సైతం గంగమ్మ జాతర ఎపిసోడ్ కోసం చాలా కష్టపడుతున్నారట ఇన్సైడ్ టాక్. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో దాదాపు 40 రోజుల పాటు ఈ కీలకమైన ఎపిసోడ్ ను ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇది థియేటర్లో నెక్స్ట్ లెవల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని నమ్ముతున్నారు.

ఇటీవల 'పుష్ప 2' సెట్స్ నుంచి జాతర సన్నివేశాల షూటింగ్ కు సంబంధించి, అల్లు అర్జున్ ఫోటోని ఆయన అభిమాని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇందులో బన్నీ కాళ్ళకి పారాణి ఉండటాన్ని మనం గమనించవచ్చు. గంగమ్మ జాతర గెటప్ కోసం ఆఫ్‌-షూట్ లోనూ ఆయన ఎంతో నిబద్ధతతో నడుచుకుంటున్నారనేది ఈ పిక్ లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సినిమా కోసం వంద శాతం ఎఫర్ట్స్ పెట్టడంలో అల్లు అర్జున్ ఎంతో డెడికేషన్ తో వర్క్ చేస్తున్నారనే విషయం అర్థమవుతుంది.

శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో 'పుష్ప' సినిమా రూపొందింది. కూలీగా జీవితాన్ని ప్రారంభించిన పుష్పరాజ్.. సిండికేట్ ను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడనేది పార్ట్-1 లో చూపించారు. ఇందులో పుష్పరాజ్ గా రా అండ్ రస్టిక్ లుక్ లో ఊర మాస్ అవతార్ లో అలరించారు అల్లు అర్జున్. అలానే చిత్తూరు స్లాంగ్ లో 'తగ్గలేదే' అంటూ చెప్పిన డైలాగ్స్, మ్యానరిజం ఆకట్టుకున్నాయి. ఇప్పుడు పుష్ప పార్ట్ 2లో ఎలాంటి కథను చెప్పబోతున్నారనే ఆసక్తి అందరిలో నెలకొంది.

'పుష్ప: ది రైజ్' సినిమా బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ గా నిలచింది. ఎవరూ ఉహించని విధంగా హిందీ మార్కెట్ లో 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దానికి ఏమాత్రం తగ్గకుండా ఉండేలా, మరింత గ్రాండియర్ గా 'పుష్ప 2' ను రూపొందిస్తున్నారు సుక్కు అండ్ టీమ్. ముందుగా ప్రకటించినట్టుగానే 2024 ఆగస్టు 15న థియేటర్లలో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేసే ప్రసక్తే లేదని జెట్ స్పీడ్ లో షూటింగ్ చేస్తున్నారు.

'పుష్ప: ది రూల్' చిత్రంలో బన్నీకి జోడీగా రష్మీక మందన్న కనిపించనుంది. ఫహాధ్ ఫాజిల్, జగపతిబాబు, సునీల్, అనసూయ, రావు రమేశ్, ధనుంజయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ యాక్షన్ డ్రామాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్స్ ఇవ్వడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు.