Begin typing your search above and press return to search.

పుష్ప2.. రంగంలోకి బాలీవుడ్ భామలు

ఈ సారి పుష్ప2 కోసం చేయబోయే ఐటెం సాంగ్ లో ఇద్దరు బాలీవుడ్ ముద్దుగుమ్మలు కనిపించబోతున్నారంట.

By:  Tupaki Desk   |   10 Jan 2024 6:07 AM GMT
పుష్ప2.. రంగంలోకి బాలీవుడ్ భామలు
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో పుష్పకి సీక్వెల్ గా ఈ మూవీ సిద్ధం అవుతోంది. ఏకంగా 300 కోట్లకి పైగా ఈ చిత్రం కోసం మైత్రీ మూవీ మేకర్స్ ఖర్చు చేస్తున్నారు. రష్మిక మందన ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఆగష్టులో రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే పుష్ప సినిమాలో సమంత చేసిన ఊ అంటావా సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ సాంగ్ లెరిక్స్ కూడా చాలా మందికి కనెక్ట్ అయ్యాయి. అందులో అన్ని భాషలలో సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. దానికి మించిపోయే విధంగా పుష్ప 2లో ఐటెం సాంగ్ ని సుకుమార్ ప్లాన్ చేశారు. ఈ సాంగ్ షూటింగ్ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుందంట.

ఈ సారి పుష్ప2 కోసం చేయబోయే ఐటెం సాంగ్ లో ఇద్దరు బాలీవుడ్ ముద్దుగుమ్మలు కనిపించబోతున్నారంట. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ గా దూసుకుపోతున్న దిశా పటాని, కృతి సనన్ లని ఈ సాంగ్ లో కోసం ఫైనల్ చేసారంట. వీరిద్దరితో అదిరిపోయే స్టెప్పులు సుకుమార్ వేయిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ లోనే పుష్పకి ఎక్కువ ఆదరణ వచ్చింది.

ఈ నేపథ్యంలో పుష్ప 2 మెయిన్ ఫోకస్ అంతా నార్త్ ఇండియాపైనే ఉంది. అక్కడ జనాల్లోకి రీచ్ కావడం కోసం ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ని పుష్ప 2 ఐటెం సాంగ్ కి తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల మాట. ఇక ఈ సినిమాపై ఇప్పటికే బిజినెస్ డీల్స్ జరుగుతున్నాయంట. చిత్ర నిర్మాతలు మాత్రం పుష్ప 2 మూవీ రైట్స్ విషయంలో భారీగా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

అలాగే ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్ల కలెక్షన్స్ మార్క్ అందుకోవాలని అనుకుంటున్నారు. దానికోసం పబ్లిసిటీని కూడా కాస్తా గ్రాండ్ గా చేయాలని చూస్తున్నారు. ఈ సంక్రాంతికి పుష్ప2 నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమో ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.