Begin typing your search above and press return to search.

పుష్ప-2 బీభత్సం.. ఏడేళ్ల రికార్డ్ బ్రేక్

తాజాగా మరో రికార్డు క్రియేట్ చేసింది. ఏకంగా 138 గంటల పాటు యూట్యూబ్ లో నెం.1 ట్రెండింగ్ స్థానంలో కొనసాగి రికార్డు సృష్టించింది.

By:  Tupaki Desk   |   14 April 2024 7:59 AM GMT
పుష్ప-2 బీభత్సం.. ఏడేళ్ల రికార్డ్ బ్రేక్
X

ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు వెయిట్ చేస్తున్న చిత్రం పుష్ప-2 ది రూల్. పుష్ప-1 ఓ రేంజ్ లో ఆకట్టుకోవడం వల్ల సెకండ్ పార్ట్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్ కూడా పుష్ప-2ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక రీసెంట్ గా విడుదలైన పుష్ప-2 టీజర్ ను అంచనాలు మరిన్ని పెంచేశాయి.

ఏప్రిల్ 8వ తేదీ బన్నీ బర్త్ డే సందర్భంగా మేకర్స్ టీజర్ ను రిలీజ్ చేయగా.. ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. టీజర్ లో మొత్తం జాతర సీన్లు చూపించారు మేకర్స్. జాతర సీన్లు, యాక్షన్, హీరో కాస్ట్యూమ్ తో దద్దరిల్లిపోయింది. బన్నీ లుక్ చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. టీజర్ తో సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని నెటిజన్లు అంటున్నారు. కానీ ఒక్క డైలాగ్ యాడ్ చేస్తే ఇంకా బాగున్ను అని అభిప్రాయపడ్డారు.

అయితే పుష్ప-2 టీజర్.. యూట్యూబ్ లో దుమ్ముదులిపేస్తోంది. అతి తక్కువ టైమ్ లోనే మిలియన్ వ్యూవ్స్ రాబట్టిన ఈ సినిమా టీజర్.. తాజాగా మరో రికార్డు క్రియేట్ చేసింది. ఏకంగా 138 గంటల పాటు యూట్యూబ్ లో నెం.1 ట్రెండింగ్ స్థానంలో కొనసాగి రికార్డు సృష్టించింది. 2017లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ మూవీ రికార్డును బద్దలు కొట్టింది. ఆ మూవీ టీజర్.. 137 గంటలకు పైగా యూట్యూబ్ లో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అయ్యి అప్పట్లో సంచలనం సృష్టించింది.

ఆ తర్వాత ఏడేళ్లలో ఎన్నో సినిమాలు వచ్చినా.. జై లవకుశ రికార్డును బద్దలు కొట్టలేకపోయాయి. ఇప్పుడు ఆ రికార్డును పుష్ప-2 టీజర్ బ్రేక్ చేసింది. 110 మిలియన్లకు పైగా వ్యూస్, 1.55 మిలియన్లకు పైగా లైక్స్‌ తో జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. టీజర్ లో అల్లు అర్జున్ చీరకట్టి, కాలు వెనక్కి మడిచి పైట కొంగును పట్టుకునే సీక్వెన్స్ చూస్తుంటే.. సినిమా కూడా తగ్గేదేలే అన్నట్లుగా ఉండబోతుందని అర్థమవుతోంది.

రిలీజ్‌ కు ముందే పుష్ప-2 రికార్డులు క్రియేట్ చేస్తే.. విడుదల తర్వాత మరిన్ని రికార్డులు కొల్లగొట్టడం ఖాయమని పలువురు సినీ పండితులు చెబుతున్నారు. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ తో పాటు రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.