Begin typing your search above and press return to search.

పూరి @25.. మరోసారి బ్లాస్ట్ చేయాల్సిందే..

టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి పూరి జగన్నాథ్

By:  Tupaki Desk   |   21 April 2024 3:57 AM GMT
పూరి @25.. మరోసారి బ్లాస్ట్ చేయాల్సిందే..
X

టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి పూరి జగన్నాథ్. భద్రి సినిమాతో డైరెక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన పూరి జగన్నాథ్ మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. తరువాత ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మా నాన్న తమిళమ్మాయి చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ ని అందుకొని కమర్షియల్ డైరెక్టర్ గా మారిపోయారు. ఈ సినిమాలతో మాస్ మహారాజ్ రవితేజని కూడా పూరి జగన్నాథ్ స్టార్ ని చేశారు.

భద్రి తరువాత జగపతిబాబుతో బాచి అనే సినిమా చేసిన అది ఫ్లాప్ అయ్యింది. కన్నడంలోకి వెళ్లి తమ్ముడు చిత్రాన్ని యువరాజా పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టారు. రవితేజతో చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ కావడంతో తెలుగులో పూరి జగన్నాథ్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వచ్చారు.

పూరి జగన్నాథ్ క్రియేట్ చేసిన హీరోయిజంకి యూత్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. అలాగే అతని డైలాగ్స్ కూడా జనాలకి బాగా రీచ్ అయ్యాయి. ఈ కారణంగా పూరి జగన్నాథ్ అనే పేరు ఒక బ్రాండ్ గా టాలీవుడ్ లో మారిపోయింది. చాలా మంది యువ హీరోలు పూరి జగన్నాథ్ తో సినిమా పడితే తమ ఇమేజ్ మారిపోతుందని భావించేవారు. అందుకే అతనితో సినిమా చేసే అవకాశం వస్తే వదులుకునేవారు కాదు.

ఇక పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండతో చేసిన లైగర్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రూపొందించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం రామ్ పోతినేనితో డబుల్ ఇస్మార్ట్ చేస్తున్నారు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించి పాన్ ఇండియా లెవల్ లోనే రిలీజ్ చేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా ఈ మూవీ సిద్ధం అవుతోంది. ఇస్మార్ట్ శంకర్ తోనే రామ్ కూడా కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.

పూరి జగన్నాథ్ దర్శకుడిగా కెరియర్ స్టార్ట్ చేసి 25 ఏళ్ళు అవుతోంది. 2000 ఏప్రిల్ 20న పూరి జగన్నాథ్ మొదటి చిత్రం భద్రి రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా రామ్ పోతినేని ఇన్ స్టాగ్రామ్ లో పూరిజగన్నాథ్ కి విషెస్ చెప్పారు. 25 ఏళ్ళ కెరియర్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ కి సార్ కి కంగ్రాట్స్ అంటూ ఇక ఈ సారి మరింత బిగ్ హిట్ అందుకోవాలి అని కోరుకున్నారు. ప్రముఖుల నుంచి కూడా ప్రత్యేక అభినందనలు లభిస్తున్నాయి.

డబుల్ ఇస్మార్ట్ తో మరల పూరి ఈజ్ బ్యాక్ అనిపించుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న దర్శకులలో అందరికంటే వేగంగా సినిమాలు చేయగల దర్శకుడిగా పూరి జగన్నాథ్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. అతని దరిదాపుల్లోకి కూడా ఇతర దర్శకులు ఎవరూ రాలేకపోయారని చెప్పాలి.