ఫ్యాక్ట్ చెక్ : పూరి మూవీలో విద్యాబాలన్ క్లారిటీ
ఇటీవల ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విద్యాబాలన్ను ఎంపిక చేశారనే వార్తలు వచ్చాయి. గత రెండు రోజులుగా ఈ విషయమై ప్రముఖంగా వస్తున్న వార్తలపై చిత్ర యూనిట్ సభ్యులను సంప్రదించిన సమయంలో క్లారిటీ ఇచ్చారు.
By: Tupaki Desk | 15 May 2025 6:30 AMడాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా ఒక సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. గత కొన్నాళ్లుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక జరుగుతోంది. తెలుగుతో పాటు సౌత్లోని అన్ని భాషల్లో, హిందీలోనూ భారీ ఎత్తున విడుదల చేసే విధంగా సినిమాను రూపొందిస్తున్నారు. కేవలం మూడు నెలల్లోనే ఈ సినిమాను పూర్తి చేయడం కోసం దర్శకుడు పూరి ఎక్కువ సమయం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి తీసుకుంటున్నాడు. ఈ సినిమాలో ఇప్పటికే టబు, రాధిక ఆప్టే కీలక పాత్రలో కనిపించబోతున్నారు అనే వార్తలు వచ్చాయి. వీరిద్దరితో పాటు నివేథ థామస్ను ఎంపిక చేశారనే వార్తలు వచ్చాయి.
ఇటీవల ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విద్యాబాలన్ను ఎంపిక చేశారనే వార్తలు వచ్చాయి. గత రెండు రోజులుగా ఈ విషయమై ప్రముఖంగా వస్తున్న వార్తలపై చిత్ర యూనిట్ సభ్యులను సంప్రదించిన సమయంలో క్లారిటీ ఇచ్చారు. విద్యా బాలన్ను ఈ సినిమా కోసం అసలు సంప్రదించలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. విద్యా బాలన్ కోసం ఈ సినిమాలో ఎలాంటి పాత్ర లేదని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఈ సినిమా నటీ నటుల విషయంలో తుది నిర్ణయం ఇంకా జరగలేదని, మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని, త్వరలోనే పూర్తి క్లారిటీ ఇస్తూ మేకర్స్ నుంచి అధికారికంగా ప్రకటన వస్తుందని చెప్పుకొచ్చారు. విద్యా బాలన్ నటించడం అనేది పుకారే అని తేలిపోయింది.
తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ విద్యా బాలన్కి మంచి క్రేజ్ ఉంది. అందుకు తగ్గట్లుగా ఆమెను ఈ సినిమాలో నటింపజేస్తే కచ్చితంగా మంచి బజ్ క్రియేట్ అవుతుందని అంతా భావించారు. కానీ చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఈ సినిమా కోసం ఆమెను కనీసం సంప్రదించినట్లుగా కూడా చెప్పడం లేదు. ముందు ముందు కూడా ఆమెను ఈ సినిమాలో తీసుకునే యోచన లేదు అన్నట్లుగానే యూనిట్ సభ్యులు చెబుతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోయిన్స్ను కాదని, టబు, రాధిక ఆప్టేలను ఈ సినిమా కోసం ఎంపిక చేయడంను బట్టి చూస్తే సినిమాను పాన్ ఇండియా మార్కెట్లో ఎక్కువగా పబ్లిసిటీ చేయాలని పూరి భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ మధ్య కాలంలో వచ్చిన లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. దాంతో ఈ సినిమా విషయంలో పూరి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ముఖ్యంగా ఈ సినిమా కథ విషయంలో చాలా వర్క్ చేశాడు. సాధారణంగా పూరి సినిమాల కోసం వర్క్ చేసే తీరు, స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఈ సినిమాకు మరో రకంగా ఆయన వర్క్ చేస్తున్నాడని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇదే ఏడాదిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అతి త్వరలోనే పూరి జగన్నాథ్ నుంచి అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం అందుతోంది.