Begin typing your search above and press return to search.

16 కోట్ల మోసం కేసులో నిర్మాతకు బెయిల్

ర‌వీంద్ర‌న్ ప్ర‌ముఖ మీడియాతో మాట్లాడుతూ.. తాను ఏ త‌ప్పు చేయ‌లేద‌ని, త‌న‌పై ఒక వ్య‌క్తి అన్యాయంగా త‌ప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయించార‌ని క‌న్నీరు పెట్టుకున్నారు.

By:  Tupaki Desk   |   12 Oct 2023 3:58 PM GMT
16 కోట్ల మోసం కేసులో నిర్మాతకు బెయిల్
X

వ్యాపారవేత్తను రూ.16 కోట్ల మోసం చేసినందుకు సినీ నిర్మాత రవీంద్రన్ చంద్రశేఖరన్‌ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఒక నెల తర్వాత అతడు షరతులతో కూడిన బెయిల్ పొందాడు. తన భార్యతో తిరిగి కలవడంపై సోషల్ మీడియాలో తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. చంద్రశేఖరన్ పర్యావరణ అనుకూల ప్రాజెక్ట్‌లో పెట్టుబడి పెట్టాలని వ్యాపారవేత్తను సంప్రదించాడు. కానీ దానిని ప్రారంభించడంలో విఫలమయ్యాడు. పెట్టుబడిదారుడిని మోసం చేసేందుకు తప్పుడు పత్రాలు, బ్యాలెన్స్ షీట్లు సృష్టించాడు. అయితే డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో పోలీసులు విచారణ జరిపి అరెస్ట్ చేశారు.

ర‌వీంద్ర‌న్ షరతులతో కూడిన బెయిల్‌పై ఈరోజు జైలు నుండి విడుదలైన అనంత‌రం టీవీ నటి అయిన తన భార్య మహాలక్ష్మితో కలిసి ఒక పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసాడు. నెల రోజుల తర్వాత ఆమెను కలవడం సంతోషంగా ఉందన్నారు. ''నా ముఖంలో చిరునవ్వు తీసుకురావడంలో నువ్వు ఎప్పుడూ విఫలం కావు. ఎవరికైనా ప్రేమకు మూలస్తంభం నమ్మకమే. కానీ ఇక్కడ ట్రస్ట్ నా కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తుంది! అదే ప్రేమతో మునుపటిలాగా నన్ను రక్షించు. లవ్ యు అమ్ము'' అని నిర్మాత రవీంద్రన్ ఎమోష‌న‌ల్ పోస్ట్ ని షేర్ చేసారు.

అత‌డి అరెస్టుకు దారితీసిన ప‌రిస్థితి ఏమిటి? అంటే.. రవీంద్రన్ చంద్రశేఖరన్ లిబ్రా ప్రొడక్షన్ అనే చలనచిత్ర నిర్మాణ సంస్థను నడుపుతున్నారు. అక్టోబర్ 2020లో అతడు మునిసిపల్ సాలిడ్‌ను మార్చే తన కొత్త పర్యావరణ అనుకూల ప్రాజెక్ట్‌లో పెట్టుబడి పెట్టడానికి బాలాజీ అనే వ్యాపారవేత్తను సంప్రదించాడు. వ్య‌ర్థాల నుంచి తీసే ఇంధనం వ్యాపారాన్ని ప్రారంభించాల‌నేది ప్లాన్‌. కానీ నిర్మాత దీనిని చేయ‌డంలో విఫలమ‌వ్వ‌డ‌మే గాక‌.. అత‌డు త‌న‌ కంపెనీ లాభాలను ఆర్జిస్తున్నట్లు ఫూల్‌ప్రూఫ్ పత్రాలను తయారు చేశాడని, కంపెనీని బ్రేకింగ్ ఈవెన్ బ్యాలెన్స్ షీట్‌ను కూడా సృష్టించాడ‌ని జాతీయ మీడియాలో ఒక క‌థ‌నం పేర్కొంది.

అయితే అతడు రూ. 16 కోట్ల మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమయ్యాడు. పెట్టుబడిదారుడు, పోలీసుల స‌మ‌క్షంలో విచారణ సాగింది. నిర్మాత ర‌వీంద్ర‌న్ అన్ని పత్రాలను తప్పుదోవ పట్టించారని కనుగొన్నారు. అనంత‌రం అత‌డిని అరెస్టు చేశారు.

ఇంట‌ర్వ్యూలో క‌న్నీరు:

ర‌వీంద్ర‌న్ ప్ర‌ముఖ మీడియాతో మాట్లాడుతూ.. తాను ఏ త‌ప్పు చేయ‌లేద‌ని, త‌న‌పై ఒక వ్య‌క్తి అన్యాయంగా త‌ప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయించార‌ని క‌న్నీరు పెట్టుకున్నారు. తాను ఊబ‌కాయంతో కింద కూచోలేని ప‌రిస్థితిలో ఉన్నా నేల‌పై కూచోబెట్టార‌ని కూడా ర‌వీంద్ర ఆవేద‌న చెందారు. క‌ష్ట‌కాలంలో త‌న భార్య అండ‌దండలు, ప్రేమ త‌న‌ను కాపాడాయ‌ని అన్నారు. ర‌వీంద‌ర్ నెల రోజులుగా జైలులో ఉన్నారు. 3రోజుల క్రితం బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చారు.