Begin typing your search above and press return to search.

మాస్ హీరోను మోసం చేసిన బండ్లన్న

మాస్ మహారాజా రవితేజతో ఆంజనేయులు సినిమా ద్వారా బండ్ల గణేష్ నిర్మాతగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు

By:  Tupaki Desk   |   14 Aug 2023 4:58 AM GMT
మాస్ హీరోను మోసం చేసిన బండ్లన్న
X

మాస్ మహారాజా రవితేజతో ఆంజనేయులు సినిమా ద్వారా బండ్ల గణేష్ నిర్మాతగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. ఆ తరువాత తీన్ మార్, గబ్బర్ సింగ్ సినిమాలు చేసి స్టార్ ప్రొడ్యూసర్ గా మారిపోయాడు. ప్రస్తుతం ప్రొడక్షన్ కి దూరంగా ఉంటూ సొంత పౌల్ట్రీ వ్యాపారం చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు ట్విట్టర్ లో పోస్టులు, యుట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూలతో బండ్ల గణేష్ కాస్తా లైవ్ లో ఉంటున్నారు.

ఇండస్ట్రీ బ్యాగ్రౌండ్, కాస్తా వివాదాస్పదమైన వ్యక్తిగా ఉండటంతో బండ్ల గణేష్ పై మీడియా ఫోకస్ కూడా ఎక్కువగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా బండ్ల గణేష్ తనని తాను చెప్పుకుంటారు. ఆయనకి సంబందించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వస్తూ ఉంటాయి. అలాగే రవితేజ గురించి బండ్ల గణేష్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ మరల ఇప్పుడు వైరల్ ఆవుతున్నాయి.

తాను రవితేజని దారుణంగా మోసం చేశానని బండ్ల గణేష్ సదరు ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆ విషయం రవితేజకి తెలిసిన ఏమీ అనలేదని కూడా తెలిపారు. రవితేజకి తాను ఒక పొలం అమ్మను. దానిని అతను ఇష్టంగానే కొనుక్కున్నారు. తరువాత ఆ పొలానికి అనుకోని ఉన్న తన 30 ఎకరాల భూమి అమ్మాలని అనుకున్నప్పుడు రవితేజ ల్యాండ్ కూడా ఇస్తేనే కొంటానని అవతలి వ్యక్తి చెప్పారు.

దీంతో తాను రవితేజకి అబద్ధం చెప్పాను. నీ భూమి మీద ప్రభుత్వం ఏదో ప్లాన్ చేస్తోంది. అమ్మేస్తే బెటర్ అని చెప్పాను. రవితేజ నమ్మేసి అలాగే అమ్మేశారు. తరువాత ఈ విషయంలో నేను చాలా బాధపడ్డా. ఒక రోజు రవితేజకి ఆవిషయాన్ని చెప్పాను. నిన్ను మోసం చేశా అని జరిగింది చెప్పేసాను. నాకు తెలుసులేరా అని రవితేజ సమాధానం ఇచ్చి లైట్ గా తీసుకున్నారు.

అయితే ఈ విషయంలో నాకు ఎప్పటికి పశ్చాత్తాపం ఉండిపోతుంది. కచ్చితంగా ఏదో ఒక రోజు రవితేజ ఋణం తీసుకుంటాను. అది ఎలా అని మాత్రం చెప్పలేను. లైఫ్ లో అలా కావాలని నా స్వార్ధం కోసం నేను రవితేజని మోసం చేశానని ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి.