Begin typing your search above and press return to search.

కోడ‌లు మెడ‌లో నెక్లెస్.. బుస్ బుస్ స్నేక్ బాబోయ్!

సిల్క్ ప్యాంట్ ధ‌రించిన పీసీ దానికి కాంబినేష‌న్ గా స్టైలిష్ వైట్ క్రాప్ టాప్ ధరించి అందాల ఆర‌బోత‌తో బోల్డ్ గా కనిపించింది.

By:  Tupaki Desk   |   15 March 2024 9:07 AM GMT
కోడ‌లు మెడ‌లో నెక్లెస్.. బుస్ బుస్ స్నేక్ బాబోయ్!
X

అమెరికా కోడ‌లు ప్రియాంక చోప్రా ముంబైలో అడుగుపెట్టింది. చాలా కాలానికి పుట్టింటికి తిరిగి వచ్చింది. ఇంత‌కీ దేనికోసం ఇలా వ‌చ్చింది? అంటే.. ఒక లగ్జరీ బ్రాండ్ ఈవెంట్ కోసం ముంబైలో అడుగుపెట్టిన పీసీ.. ఇక్క‌డ అడుగుపెడుతూనే మైండ్ బ్లాక్ చేసింది. స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్లు త‌న వెంట ప‌డి మ‌రీ ఫోటోషూట్లు చేసారు. తాజాగా రిలీజైన ఫోటోల్లో పీసీ రూపం కుర్ర‌కారు గుండెల్లో గుబులు పెంచింది. సిల్క్ ప్యాంట్ ధ‌రించిన పీసీ దానికి కాంబినేష‌న్ గా స్టైలిష్ వైట్ క్రాప్ టాప్ ధరించి అందాల ఆర‌బోత‌తో బోల్డ్ గా కనిపించింది. పోనీటైల్ హెయిర్ క‌ట్, హైహీల్స్ లో స్పెష‌ల్ గా క‌నిపించింది.

దాదాపు ఏడాది తర్వాత భారతదేశాన్ని సందర్శించిన ప్రియాంక చోప్రా ప్రత్యేక కార్యక్రమంలో కెమెరాల ముందు నవ్వుతూ కనిపించింది. కెమెరాల వైపు చూస్తూ నమస్తే అంటూ అంద‌ర‌నీ పలకరించింది. త‌న లేటెస్ట్ విహారయాత్రకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇన్‌స్టాలో వైర‌ల్ గా షేర్ అవుతున్నాయి. అభిమానులు వ్యాఖ్యల విభాగంలో ప్రశంస‌ల్లో ముంచేస్తున్నారు. ఇక అంద‌రి క‌ళ్లు పీసీ మెడ‌లో ఉన్న ఆ గోల్డెన్ స్నేక్ నెక్లెస్ పైనే నిలిచాయి. ఒక పామును మెడ‌లో వేసి చుట్టేసిన‌ట్టుగా ఎంత అందంగా డిజైన్ చేసారు? రియ‌ల్లీ స్ట‌న్నింగ్ అంటూ ఫ్యాన్స్ ప్ర‌శంసిస్తున్నారు. పీసీ మెడ‌లో నెక్లెస్ చూసి పాము అనుకున్నాను అని ఒక‌రు వ్యాఖ్యానించ‌గా, ఆ నెక్లెస్.. బుస్ బుస్ స్నేక్ బాబోయ్! అంటూ మ‌రొక‌రు కొంటెగా కామెంట్ చేసారు.

బల్గారీ స్టోర్ గ్రాండ్ లాంచ్ కోసం ప్రియాంక చోప్రా ముంబైలో అడుగుపెట్ట‌డానికి కార‌ణం.. ఈ కార్పొరెట్ కు ప్రపంచ బ్రాండ్ అంబాసిడర్‌లలో పీసీ కూడా ఒక‌రిగా ఉన్నారు.. ఇతర అంబాసిడర్‌లలో అన్నే హాత్వే, జెండయా, లిసా వంటి స్టార్లు ఉన్నారు. ప్రియాంక తన ఇన్‌స్టాలో తాను భారతదేశానికి ప్రయాణ‌మ‌వుతున్నాన‌ని ప్రకటించింది. తన కుమార్తె మాల్తీతో క‌లిసి ఉన్న‌ సెల్ఫీని పీసీ షేర్ చేసింది. ``ముంబయి మేరీ జాన్.. ఇదిగో!``అని వ్యాఖ్యానించింది. ఆ ఫోటోలు వైర‌ల్ అయ్యాయి.

కొన్ని గంటల తర్వాత తల్లీ కూతుళ్లిద్దరూ ముంబై విమానాశ్రయంలో కనిపించారు. కొద్దిసేపటికే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ త‌ర్వాత‌ ప్రియాంక బీచ్ లో టోపీ ధ‌రించి నలుపు రంగు దుస్తుల్లో కనిపించిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. అక్క‌డ‌ మాల్తీ ఆకుపచ్చ టాప్ ప్యాంటు కాంబోలో కనిపించింది. ప్రియాంక తన కూతురిని ఈసారి కెమెరాల ముందు దాచ‌లేదు. తన కారులోకి వెళ్ళే ముందు ఫోటోగ్రాఫ‌ర్స్ అంద‌రినీ ఆప్యాయంగా పలకరించింది. మాల్టీ భారత్‌లో పర్యటించడం ఇది రెండోసారి. గత ఏడాది ఏప్రిల్‌లో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ లాంచ్ కోసం నిక్ - ప్రియాంక త‌మ చిన్నారి మాల్తీని వెంట తీసుకొచ్చారు.