Begin typing your search above and press return to search.

అయోధ్య రామ‌య్య‌ ద‌ర్శ‌నంలో బుల్లి ప్రియాంక‌

కానీ గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా మాత్రం ఈ ప‌విత్ర క‌ర్య‌క్ర‌మానికి హాజ‌రు కాలేక‌పోయారు.

By:  Tupaki Desk   |   20 March 2024 3:08 PM GMT
అయోధ్య రామ‌య్య‌ ద‌ర్శ‌నంలో బుల్లి ప్రియాంక‌
X

అయోధ్య రామ‌మందిర ప్రాణ‌ప్ర‌తిష్ఠ కార్య‌క్ర‌మానికి దేశం న‌లుమూల‌ల నుంచి ప్ర‌ముఖులు హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ నుంచి దిగ్గ‌జాలంతా ఈ వేడుక‌కు హాజ‌ర‌య్యారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ ఎటెండ‌య్యారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, అలియా భట్ స‌హా చాలా మంది హిందీ తారలు అయోధ్య రాముని సంద‌ర్శ‌నంతో పునీతుల‌య్యారు.


కానీ గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా మాత్రం ఈ ప‌విత్ర క‌ర్య‌క్ర‌మానికి హాజ‌రు కాలేక‌పోయారు. అయోధ్య ప్రాణ‌ప్ర‌తిష్ఠ‌లో పాల్గొన‌లేక‌పోయినందుకు పీసీ కొంత క‌ల‌తకు గురైంది. అందుకే ఇప్పుడు భ‌ర్త‌ నిక్ జోనాస్, కుమార్తె మాల్తీ మేరీతో కలిసి పవిత్ర నగరమైన అయోధ్య(ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌)ను సందర్శించారు. అందమైన చిలుకాకుపచ్చ చీర ధరించి, నిక్‌తో పాటు ప్రియాంక పూజాకార్యక్ర‌మాల్లో పాల్గొంది. వేడుక వ‌ద్ద ఈ జంట పూర్తిగా సాంప్ర‌దాయ‌బ‌ద్ధంగా క‌నిపించింది. ఈ సెల‌బ్రిటీ జంట‌ను జై శ్రీ రామ్ నినాదాలతో సాదరంగా స్వాగతం పలికారు. ఈ ఆధ్యాత్మిక యాత్రలో ప్రియాంక తల్లి డాక్టర్ మధు చోప్రా కూడా వారితో కలిసి వచ్చారు. వారితో పాటు క్యూట్ మాల్తీ మేరీ ఈ సంద‌ర్శ‌నంలో అంద‌రి క‌ళ్ల‌ను ఆక‌ర్షించింది.

ప్రియాంక - నిక్ జంట‌ భారత పర్యటన ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ముంబైలో బ‌ల్గారి స్టోర్ (రిల‌య‌న్స్) ప్రారంభోత్సవానికి హాజరైన ప్రియాంక గత వారం మాల్టీ మేరీతో కలిసి వచ్చారు. ఇషా అంబానీ హోస్ట్ చేసిన ప్రీ-హోలీ వేడుకల్లో కూడా పీసీ సంద‌డి చేసింది. నిక్ కొంతకాలం తర్వాత ప్రియాంకతో చేరారు. ఈ జంట పార్టీలలో కనిపించారు. త‌దుప‌రి ఫ‌ర్హాన్ అక్త‌ర్ కి చెందిన‌ ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ లో నిలిచిపోయిన‌ `జీ లే జరా`ను రీలాంచ్ చేసేందుకు చ‌ర్చిస్తోంద‌నే పుకార్లు తెర‌పైకొచ్చాయి. ఈ వారం ప్రారంభంలో ప్రియాంక అమెజాన్ ప్రైమ్ వీడియో ఈవెంట్‌కు హాజరై `విమెన్ ఆఫ్ మై బిలియన్` చిత్రానికి స‌మ‌ర్ప‌కురాలిగా తన మద్దతును ప్రక‌టించింది.