ఆమెకు రూ.30 కోట్లు.. వర్త్ వర్మ వర్త్
హీరోలతో పోల్చితే హీరోయిన్స్ పారితోషికం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువగా ఉంటుంది.
By: Tupaki Desk | 17 April 2025 6:00 PM ISTహీరోలతో పోల్చితే హీరోయిన్స్ పారితోషికం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సౌత్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ పారితోషికం పాతాళంలో ఉంటుంది అనేది టాక్. చాలా మంది హీరోయిన్స్ కనీసం కోటి రూపాయల పారితోషికం తీసుకోకుండా స్టార్ హీరోల సినిమాల్లో నటించడం మనం చూస్తూ ఉంటాం. ఒకే సినిమాలో నటించే హీరో, హీరోయిన్ పారితోషికంలో చాలా వ్యత్యాసం ఉంటుంది. హీరోల పారితోషికం వంద కోట్లకు పైగా ఉంటే, హీరోయిన్స్ పారితోషికం కనీసం మూడు నాలుగు కోట్లు కూడా ఉండదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నట్లుగా అనిపిస్తుంది. స్టార్ హీరోల పారితోషికాలతో పాటు హీరోయిన్స్ పారితోషికం కూడా భారీగా పెరుగుతోంది.
బాలీవుడ్లో ఆలియా భట్, దీపికా పదుకునే బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్స్గా గత నాలుగు ఐదు సంవత్సరాలుగా నిలిచిన విషయం తెల్సిందే. ఈమధ్య కాలంలో వీరిద్దరితో పాటు మరికొందరు సైతం దాదాపు ఆ స్థాయి పారితోషికంను అందుకుంటన్నారు. అయితే అంతకు మించి అన్నట్లుగా ప్రియాంక చోప్రా ఏకంగా రూ.30 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం అందుతోంది. మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో రూపొందుతున్న సినిమా కోసం ప్రియాంక చోప్రా రూ.30 కోట్ల పారితోషికం అందుకుంటుందట. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా చరిత్రలో ఏ హీరోయిన్ తీసుకోని పారితోషికంను పీసీ అందుకుంటుంది.
కేవలం రాజమౌళి, మహేష్ బాబు సినిమాకు మాత్రమే కాకుండా క్రిష్ 4 సినిమాలో నటించేందుకు గానూ ప్రియాంక చోప్రా రూ.30 కోట్లకు మించి పారితోషికం అందుకోబోతుందని తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా ఇండియన్ మార్కెట్ను కాకుండా అంతర్జాతీయ మార్కెట్పై కన్ను వేశాయి. అందుకే గ్లోబల్ బ్యూటీగా గుర్తింపు దక్కించుకుని హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్లతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న ప్రియాంక చోప్రాను తమ సినిమాల్లో నటింపజేస్తున్నారు. ఆమె నటించడం వల్ల హాలీవుడ్లో మంచి క్రేజ్ దక్కే అవకాశాలు ఉన్నాయి. తద్వారా సినిమాకు భారీ వసూళ్లు వస్తాయని మేకర్స్ భావిస్తున్నారు. ప్రియాంక చోప్రాకి ఉన్న బ్రాండ్ వ్యాల్యూకి రూ.30 కోట్లు అనేది వర్త్ అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బాలీవుడ్లో ప్రియాంక చోప్రా సినిమా వచ్చి దాదాపు అయిదు సంవత్సరాలు అవుతుంది. ఈ ఐదేళ్లు హాలీవుడ్లో కొన్ని సినిమాలు, సిటాడెల్ అనే వెబ్ సిరీస్ను చేసింది. అక్కడ గొప్ప విజయాలు పెద్దగా ఏమీ లేవు, అంతే కాకుండా అక్కడ నుంచి ఇండియాలో విడుదల అయ్యి రికార్డ్లు సృష్టించిన సినిమాలు కూడా ప్రియాంక చోప్రాకి లేవు. అయినా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆమె స్థాయి అమాంతం పెరిగింది. ఐదేళ్ల తర్వాత వచ్చినా కూడా ఏకంగా రూ.30 కోట్ల పారితోషికం అందుకుంటుంది. రాజమౌళి అంత సులభంగా హీరోయిన్స్కి అయినా, ఇతర నటీనటులకు అంత ఖర్చు పెట్టడు. కనుక ఆయన వర్త్ అనుకుంటేనే పెడుతాడు అనడంలో సందేహం లేదు. క్రిష్ 4 సినిమాకు సైతం హృతిక్ రోషన్ను ఆమెను ఎంపిక చేసేందుకు నిర్మాతలను ఒప్పించారని తెలుస్తోంది.