Begin typing your search above and press return to search.

చిరంజీవిపై పృథ్వీరాజ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

పృథ్వీరాజ్ సుకుమారన్ క‌థానాయ‌కుడిగా బ్లెస్సీ దర్శకత్వం వ‌హించిన `ఆడుజీవితం` (ది గోట్ లైఫ్‌) మార్చి 28న థియేటర్లలోకి రానుంది.

By:  Tupaki Desk   |   23 March 2024 5:13 AM GMT
చిరంజీవిపై పృథ్వీరాజ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు
X

పృథ్వీరాజ్ సుకుమారన్ క‌థానాయ‌కుడిగా బ్లెస్సీ దర్శకత్వం వ‌హించిన `ఆడుజీవితం` (ది గోట్ లైఫ్‌) మార్చి 28న థియేటర్లలోకి రానుంది. య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కింది. 2019లో బ్లెస్సీ సినిమాపై తనకున్న కమిట్‌మెంట్ కారణంగా మెగాస్టార్ చిరంజీవి `సైరా నరసింహారెడ్డి` ఆఫ‌ర్‌ని వదులుకోవాల్సి వచ్చిందని పృథ్వీరాజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చిరంజీవికి రెండుసార్లు నో చెప్పాను.. కానీ మెగాస్టార్ ఇప్పటికీ నాతో మంచి బంధాన్ని కొనసాగిస్తున్నారు.. అని తెలిపాడు.

తాజా ఈవెంట్లో తెలుగు మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి తాను చెప్పిన కుంటె సాకులు, కొన్ని యాధృచ్ఛిక అబద్ధాలు చెప్పినా వాటిని అర్థం చేసుకున్నందుకు చింతిస్తున్నానని అన్నారు. 2018లో, చిరంజీవి `సైరా నరసింహా రెడ్డి`లో ఒక పాత్రను పోషించడానికి మణిరత్నం భార్య, నటి సుహాసిని మణిరత్నం ద్వారా పృథ్వీని సంప్రదించారు. మెగాస్టార్ తనని పెద్ద పాత్ర కోసం పిలుస్తున్నార‌ని, అది గొప్ప అవ‌కాశం అని వివ‌రించారు. అయితే `ఆడుజీవితం` కోసం గత పదేళ్లుగా ఎదురుచూస్తున్నానని, ఆ పాత్ర కోసం గడ్డం పెంచి బరువు తగ్గానని పృథ్వీ చిరంజీవికి వివరించాడు. ఈసారి పరిస్థితిని మెగాస్టార్ అర్థం చేసుకున్నారు.

అయితే నాలుగేళ్ల తర్వాత పృథ్వీ దర్శకుడిగా మారి తెర‌కెక్కించిన‌ తొలి చిత్రం `లూసిఫర్‌` కేరళలో విజయవంతమైంది. ఆ సినిమా హక్కులను చిరంజీవి కొనుగోలు చేయగా `సైరా` విడుదలకు సిద్ధమైంది. కేరళలో జరుగుతున్న `సైరా నరసింహారెడ్డి` ప్రమోషనల్ ఈవెంట్‌కు మెగాస్టార్ పృథ్వీని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. చిరంజీవి తెలుగులో `లూసిఫర్` తీయాలని అనుకున్నారని, అయితే క్రేజీగా ఆడు జీవితం సినిమా కోసం గడ్డం పెంచి బరువు తగ్గాల్సి వచ్చిందని, అందుకే `లూసిఫర్` తెలుగు వెర్షన్ చేయలేకపోయానని మళ్లీ పృథ్వీ బదులిచ్చాడు. దానికి చిరంజీవి ఫన్నీ టోన్‌లో బదులిచ్చారు. ఏయ్! కొన్నాళ్ల క్రితం నువ్వు కూడా ఇదే కథ చెప్పావు... అంటూ స‌ర‌దాగా న‌వ్వేసారు.

కానీ పృథ్వీ చిరంజీవిని స్వీట్ పర్సన్ అని అభిమానం చాటుకున్నారు. చిరు త‌న‌కు టచ్ లో ఉంటూ అప్పుడప్పుడు మెసేజ్ చేస్తార‌ని కూడా తెలిపారు. లూసిఫర్ తెలుగు రీమేక్ `గాడ్ ఫాదర్` విడుదలైనప్పుడు చిరంజీవి కుమారుడు, స్టార హీరో రామ్ చరణ్ పృథ్వీకి ఫోన్ లో సందేశం పంపారు. ఏదో ఒక రోజు వారితో కలిసి పనిచేయగలనని పృథ్వీరాజ్ ఆశిస్తున్నాడు.