Begin typing your search above and press return to search.

2026లో మాలీవుడ్ సంచ‌ల‌నం టాలీవుడ్ లో!

అయితే తాజాగా పృధ్వీ క‌న్ను టాలీవుడ్ పై ప‌డిన‌ట్లు క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే తెలుగు పాన్ ఇండియా చిత్రాల్లో కీల‌క పాత్ర‌ల్లో ఛాన్సులందుకుంటున్నాడు.

By:  Tupaki Desk   |   8 May 2025 11:30 PM
2026లో మాలీవుడ్ సంచ‌ల‌నం టాలీవుడ్ లో!
X

మాలీవుడ్ సంచ‌ల‌నం పృధ్వీరాజ్ సుకుమార‌న్ న‌టుడిగా-డైరెక్ట‌ర్ గా స‌త్తా చాటుతోన్న సంగ‌తి తెలిసిందే. 'బ్రోడాడీ', 'లూసీఫ‌ర్', 'ఎంపురాన్' లాంటి చిత్రాల‌తో డైరెక్ట‌ర్ గా వ‌రుస హ్యాట్రిక్ లు న‌మెదు చేసాడు. 'లూసీఫ‌ర్' తెలుగులో 'గాడ్ ఫాద‌ర్' టైటిల్ తో రీమేక్ కూడా అయిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే రిలీజ్ అయిన 'ఎంపురాన్ ఎల్-2' స‌క్సెస్ మాత్రం మాలీవుడ్ వ‌ర‌కే ప‌రిమిత‌మైంది. టాలీవుడ్ లో పెద్ద‌గా రాణించ‌లేదు.

అయితే తాజాగా పృధ్వీ క‌న్ను టాలీవుడ్ పై ప‌డిన‌ట్లు క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే తెలుగు పాన్ ఇండియా చిత్రాల్లో కీల‌క పాత్ర‌ల్లో ఛాన్సులందుకుంటున్నాడు. చాలా మంది న‌టులున్నా పృధ్వీని ఏరికోరి మ‌రి తీసుకుంటున్నారు. ఎస్ ఎస్ ఎంబీ 29 లో కూడా కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఇలా న‌టుడిగా పృధ్వీకి ఎర్ర తివాచీ వేసి మ‌రీ అవ‌కాశాలు క‌ల్పిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడిగాను ఇక్క‌డ నుంచే పాన్ ఇండి యాలో స‌త్తా చాటే ప్ర‌ణాళిక సిద్దం చేస్తున్న‌ట్లు స‌మాచారం.

వచ్చే ఏడాది నుంచి ఆ ప్రణాళిక అమ‌లు చేయ‌బోతున్నాడుట‌. రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్, ప్ర‌భాస్, బ‌న్నీ లాంటి స్టార్ హీరోల‌ను దృష్టిలో పెట్టుకుని వాళ్ల కోసం ప్ర‌త్యేకంగా పాన్ ఇండియా స్టోరీలు సిద్దం చేస్తు న్నాడుట‌. ఇవ‌న్నీ పృధ్వీ మార్క్ యూనిక్ అప్పీల్ ఉన్న క‌థ‌ల‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాల నుంచి లీకైంది. వీటిలో కొన్ని టెక్నిక‌ల్ గా హైలైట్ అయ్యే స్టోరీలు కూడా ఉన్నాయంటున్నారు.

ఐదేళ్ల త‌ర్వాతైనా ఈ క‌థ‌లు తెర‌కెక్కించేలా అడ్వాన్స్ గా రాసుకున్నాడుట‌. వ‌చ్చే ఏడాది నుంచి ద‌ర్శ‌కు డిగా త‌న ప్ర‌య‌త్నాలు టాలీవుడ్ లో మొద‌ల‌వుతాయ‌ని తెలుస్తోంది. స్టోరీ న‌చ్చితే పృధ్వీని ఎంచే హీరో ఎవ‌రుంటారు. డైరెక్ట‌ర్ గా ఇప్ప‌టికే ప్రూవ్డ్. చేసిన మూడు చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన‌వే క‌దా.