Begin typing your search above and press return to search.

ప్రశాంత్ వర్మ.. ఈ సస్పెన్స్ ఎందుకబ్బా?

వచ్చే సంక్రాంతికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. అయితే ఆ సినిమా కన్నా ముందు.. ప్రశాంత్ మరో చిత్రం తీయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   13 March 2024 5:30 PM GMT
ప్రశాంత్ వర్మ.. ఈ సస్పెన్స్ ఎందుకబ్బా?
X

హనుమాన్.. ఈ సంక్రాంతికి చిన్న మూవీగా విడుదలై ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. భారీ లాభాలు సంపాదించింది. తేజ సజ్జా లీడ్ రోల్ లో నటించిన ఈ మూవీ.. ఇంకా ఓటీటీలోకి రాలేదు. ప్రస్తుతం దాని కోసం మూవీ లవర్స్ అంతా ఎదురు చూస్తున్నారు. మార్చి లాస్ట్ లో జీ-5 లో స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు సమాచారం. అయితే ఈ మూవీ తర్వాత ప్రశాంత్ వర్మ నెక్స్ట్ సినిమాలపై మంచి ఇంట్రెస్ట్ నెలకొంది.

ఇటీవల.. ప్రశాంత్ వర్మ హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించారు. వచ్చే సంక్రాంతికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. అయితే ఆ సినిమా కన్నా ముందు.. ప్రశాంత్ మరో చిత్రం తీయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. హనుమాన్ ప్రమోషన్స్ టైం లో తాను బాలయ్య తో మూవీ చేస్తానని కూడా చెప్పారు. ఇప్పుడు తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టారు ప్రశాంత్ వర్మ.

"మళ్లీ తన హ్యాపీ ప్లేస్ లోకి వచ్చాను. బాబు.. రెడీ.. బాబు" అంటూ పోస్ట్ చేశారు ప్రశాంత్ వర్మ. షూటింగ్ లొకేషన్ కు సంబంధించిన ఫొటోను కూడా షేర్ చేశారు. దీంతో ఆయన దర్శకత్వంలో కొత్త ప్రాజెక్ట్ మొదలైందని అర్థం అయ్యింది. అయితే అది ఏ సెట్స్? ఏ ప్రాజెక్ట్ ? అనేది క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్ లో తన ఫ్యాన్స్ ను ఉంచేశారు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు ఆయన పోస్ట్ పై రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

బాలయ్యకు, ప్రశాంత్ వర్మకు మంచి రిలేషన్ ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలసి.. ఆహాలో స్ట్రీమ్ అయిన అన్ స్టాపబుల్ షో కోసం పని చేశారు. ఇప్పుడు మళ్లీ కొత్త సీజన్ కోసం వీరిద్దరూ పనిచేస్తున్నారని కొందరు నెటిజన్లు అంటున్నారు. లేక సైలెంట్ గా జై హనుమాన్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసేశారా అని అడుగుతున్నారు. దీనిపై ప్రశాంత్ వర్మ స్పందిస్తే గానీ అసలు విషయం బయటకు రాదు.

మరోవైపు బాలకృష్ణ ప్రస్తుతం.. బాబీతో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన బ్లాస్టింగ్ గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. 1980 నాటి కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దసరా పండుగ కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.