Begin typing your search above and press return to search.

KGF నీల్‌తో చ‌ర్చ‌లు.. త‌ళా ఫ్యాన్స్‌కి గూస్‌బంప్స్

కేజీఎఫ్- కేజీఎఫ్ 2, స‌లార్ చిత్రాల‌తో పాన్ ఇండియాలో సంచ‌ల‌న విజ‌యాలు అందుకున్నాడు ప్ర‌శాంత్ నీల్

By:  Tupaki Desk   |   22 Jan 2024 4:20 AM GMT
KGF నీల్‌తో చ‌ర్చ‌లు.. త‌ళా ఫ్యాన్స్‌కి గూస్‌బంప్స్
X

కేజీఎఫ్- కేజీఎఫ్ 2, స‌లార్ చిత్రాల‌తో పాన్ ఇండియాలో సంచ‌ల‌న విజ‌యాలు అందుకున్నాడు ప్ర‌శాంత్ నీల్. ఇప్పుడు భార‌త‌దేశంలో మోస్ట్ వాంటెడ్ ద‌ర్శ‌కుల జాబితాలో అత‌డు రాజ‌మౌళి త‌ర్వాత అంత‌టివాడిగా ఎదిగాడు. ప్ర‌శాంత్ నీల్ కాల్షీట్ల కోసం ఇప్పుడు దేశంలోని దిగ్గ‌జ హీరోలంతా క‌ళ్లు కాయ‌లు కాసేలా వేచి చూస్తున్నారు. ఇంత‌లోనే అత‌డు రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ స‌లార్ కి సీక్వెల్ ని పూర్తి చేసేందుకు వేగంగా పావులు క‌దుపుతున్నాడ‌ని టాక్ ఉంది.

స‌లార్ స‌క్సెస్ త‌ర్వాత స‌లార్ 2తో మ‌రోసారి సంచ‌ల‌నం సృష్టించాల‌ని ప్ర‌శాంత్ నీల్ క‌ల‌లుగంటున్నాడు. ఇలాంటి స‌మ‌యంలో ఇప్పుడు నీల్ జాబితాలోకి త‌ళా అజిత్ వ‌చ్చి చేరాడ‌ని క‌థ‌నాలొస్తున్నాయి. అజిత్ చాలా కాలంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. వీరిద్దరూ తమ మొట్టమొదటి యూనియన్ కోసం ప్రారంభ ద‌శ‌ చర్చను పూర్తి చేసారు. తాజా క‌థ‌నాల‌ ప్రకారం.. ప్రశాంత్ నీల్ త‌ళా అజిత్‌తో టచ్‌లో ఉన్నాడని, వీరిద్దరూ చేతులు కలపడం ఖాయమ‌ని గుస‌గుస వినిపిస్తోంది.

నిజానికి అజిత్ 'కెజిఎఫ్ 1' తర్వాత ప్రశాంత్ నీల్‌తో క‌లిసి ప‌ని చేయాల‌ని భావించాడు. కానీ నీల్ కి కాల్షీట్ల స‌మ‌స్య ఎదురైంది. వ‌రుస షెడ్యూళ్ల‌తో బిజీగా ఉన్న అత‌డు తన ముందస్తు కమిట్‌మెంట్‌లను పరిగణనలోకి తీసుకుని అజిత్ ఆఫర్‌ను తిరస్కరించినట్లు సమాచారం. అయితే ప్రశాంత్ నీల్.. అజిత్ టీమ్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నాడు. ఇప్ప‌టికి తొలి క‌ల‌యిక‌ కోసం ప్రారంభ చర్చలు విజయవంతంగా పూర్త‌యాయి. అయితే ప్రశాంత్ నీల్ అజిత్‌తో సినిమాని ఎప్పుడెప్పుడు తీయబోతున్నాడు? అన్న‌ది తెలియాలంటే కొంత‌కాలం వేచి చూడాలి. స‌లార్ 2- ఎన్టీఆర్ 31- కేజీఎఫ్ 3 లాంటి భారీ చిత్రాల‌తో ఊపిరాడ‌ని షెడ్యూళ్ల‌తో బిజీగా ఉన్నాడు నీల్. కాబట్టి అజిత్‌తో ప్రశాంత్ నీల్ సినిమా చేయడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు లేదా అజిత్ కోసం ఏదో ఒక సినిమాని లైన‌ప్ లో వెన‌క్కి నెట్టి, తేదీల్ని రీఅడ్జ‌స్ట్ చేయాల్సి రావొచ్చ‌ని భావిస్తున్నారు.

అజిత్ ప్రస్తుతం మగిజ్ తిరుమేని దర్శకత్వంలో 'విదాముయార్చి' చిత్రంలో నటిస్తున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా షూటింగ్ అజర్‌బైజాన్‌లో జరుగుతోంది. అజిత్ ఈ చిత్రంలో స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్న ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. ఈ చిత్రం 2024 మధ్యలో థియేట‌ర్ల‌లోకి రావచ్చని ఊహాగానాలు ఉన్నాయి. దర్శకుడు ఆదిక్ రవిచందర్‌తో కూడా అజిత్ ఓ చిత్రం చేస్తున్నారు. విదాముయార్చి తర్వాత ఆదిక్ తో సినిమా ఉంటుంద‌ని సమాచారం.