Begin typing your search above and press return to search.

సముద్రంతో నీల్ 'డ్రాగన్'.. డేంజరస్ ఎలివేషన్స్!

రీసెంట్‌గా విడుదల చేసిన ఓ ఫొటో ఈ అంచనాలను మరింత పెంచేసింది. సముద్ర తీరంలో ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ చర్చిస్తున్న స్టిల్ ఒకటే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

By:  Tupaki Desk   |   21 April 2025 11:32 AM
NTR Prashanth Neel New Stills
X

కెజీఎఫ్, సలార్ లాంటి మాస్ మాసివ్ యాక్షన్ ఫిల్మ్స్ తర్వాత ప్రశాంత్ నీల్ ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి రూపొందిస్తున్న ‘డ్రాగన్’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్‌గా విడుదల చేసిన ఓ ఫొటో ఈ అంచనాలను మరింత పెంచేసింది. సముద్ర తీరంలో ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ చర్చిస్తున్న స్టిల్ ఒకటే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఇక ఆ ఫొటో వెనుక ఉన్న మూడ్, మిస్టరీ... అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.


ఈ ఫొటో చూస్తే ఖచ్చితంగా ఇదేదో సీన్ ప్రిపరేషన్ అయ్యే క్షణం అనిపిస్తోంది. మరీ ముఖ్యంగా, సముద్రం అద్దంగా నిలిచేలా బీచ్‌పై మాస్ డైరెక్టర్ నీల్ ఎన్టీఆర్ ఇద్దరూ మాట్లాడుకుంటున్నా స్టిల్లో... ఏదో బలమైన సన్నివేశాన్ని సూచిస్తుంది. ఫ్యాన్స్ మాత్రం ఇది ఓ కీలక యాక్షన్ సీన్ కంటే ముందు ప్లానింగ్ కావచ్చని చెబుతున్నారు. నీల్ సినిమాల్లో సముద్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది.

‘సముద్రం అంటే డైరెక్టర్ నీల్ కు చాలా ఫాంటసీ అని KGF లోనే చూపించాడు.. హీరో ఎలివేషన్స్ ను అందులో సముద్రంతో పోల్చడం బాగా హైలెట్ అయ్యింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ డ్రాగన్ లో కూడా ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు అర్ధమవుతుంది. ఇదంతా చూస్తుంటే.. ప్రశాంత్ నీల్ సముద్రాన్ని ఎలివేషన్ వెపన్ గా ఉపయోగించడంలో మాస్టర్ అనిపించుకుంటున్నారు.

ఇప్పుడు మంగళూరులో ఓ భారీ పోర్ట్ సెట్‌ను ఈ సినిమా కోసం సిద్ధం చేసినట్లు సమాచారం. అంటే సముద్రాన్ని కేవలం బ్యాక్ డ్రాప్‌గానే కాకుండా, కథలో కీలక అంశంగా చూపించే ఛాన్స్ ఉంది. KGF కంటే డేంజరస్ ఎలివేషన్స్ ఇచ్చేలా ఉన్నట్లు అర్ధమవుతుంది. కథలో వాస్తవతను మిక్స్ చేస్తూ విజువల్‌గా విభిన్న అనుభూతిని అందించడంలో ఆయనకు సాటి లేరు. ఇక ఎన్టీఆర్ హీరోగా నటిస్తుండటం.. ఆయన యాక్షన్ ప్రెజెన్స్.. ఎమోషనల్ డెప్త్ కలిగిన కథతో మిక్స్ చేస్తే.. డ్రాగన్ భారీ స్థాయిలో పేలే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. మ్యూజిక్‌కు కెజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ పని చేస్తున్నారు. ఈ సినిమా 2026 సమ్మర్‌లో పాన్ ఇండియా విడుదల కానుంది. ఇందులో రుక్మిణి వసంత కథానాయికగా నటించనుండగా, తెలుగు సినిమా చరిత్రలో మరిచిపోలేని యాక్షన్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలనే ఆలోచనతో టీమ్ పని చేస్తోంది.