Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: సుహాస్ ప్రసన్నవదనం.. నెవ్వర్ బిఫోర్!

ఇప్పుడు త్వరలోనే ప్రసన్నవదనం సినిమాతో సందడి చేయనున్నారు సుహాస్.

By:  Tupaki Desk   |   27 April 2024 4:35 AM GMT
ట్రైలర్ టాక్: సుహాస్ ప్రసన్నవదనం.. నెవ్వర్ బిఫోర్!
X

కలర్ ఫొటోతో హీరోగా మారిన యువ నటుడు సుహాస్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. రైటర్ పద్మభూషణ్, అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టారు. ఇటీవల కొందరు యువ నటులతో కలిసి చేసిన శ్రీరంగనీతులు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో అంథాలజీ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ అందుకుంది.

ఇప్పుడు త్వరలోనే ప్రసన్నవదనం సినిమాతో సందడి చేయనున్నారు సుహాస్. డైరెక్టర్ అర్జున్ వీకే దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ మే3వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఎవరి ముఖాలు సరిగ్గా కనిపించని అరుదైన వ్యాధి ఫేస్ బ్లైండ్ నెస్ తో బాధపడుతున్న వ్యక్తిగా సుహాస్ కనిపించనున్నారు. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన టీజర్ ద్వారా సుహాస్ రోల్ పై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. నెవ్వర్ బిఫోర్ అనేలా కొత్త కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.

రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన ఈ మూవీ ట్రైలర్.. ప్రస్తుతం అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. ట్రైలర్ విషయానికొస్తే.. సినిమాలో సుహాస్ పాత్రను సూర్యగా ప్రెజెంట్ చేశారు. తనకు ఉన్న వ్యాధి గురించి చెప్పి, అనంతరం అతడి ప్రేమ‌ క‌థ‌, మూడు మ‌ర్డ‌ర్ కేసుల్లో ఇరుక్కోవడాన్ని మేకర్స్ చూపించారు. ఫేస్ బ్లైండ్‌ నెస్ ఉన్న హీరో ఆ మ‌ర్డ‌ర్ కేసుల్లోంచి ఎలా తప్పించుకుని బయటకు వచ్చాడు? అస‌లు హంత‌కుడిని చ‌ట్టానికి ఎలా అప్ప‌గించాడనేదే సినిమా కథగా తెలుస్తోంది.

ప్రసన్నవదనం ట్రైలర్ బాగుంది. విజువల్స్ మంచి ఇంపాక్ట్ ను క్రియేట్ చేశాయి. సుహాస్ నటన అదిరిపోయింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, డైలాగ్స్ అలరించాయి. సినిమాపై ట్రైలర్ మరిన్ని అంచనాలు పెంచేసిందని నెటిజన్లు అంటున్నారు. కాన్సెప్ట్ చాలా బాగుందని, సుహాస్ కు మరో హిట్ పక్కా అని కామెంట్లు పెడుతున్నారు. హిలేరియస్ పాయింట్ తో క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండబోతున్నట్లు చెబుతున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే.. లిటిల్ థాట్స్ సినిమాస్ బ్యానర్ పై మణికంఠ, ప్రసాద్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుహాస్ సరసన పాయల్ రాధాకృష్ణ హీరోయిన్ గా నటిస్తోంది. రాశీ సింగ్, నందు, వైవా హర్ష, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత, కుశాలిని తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ బుల్గేనిన్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.