Begin typing your search above and press return to search.

కెరీర్ ముగిసినా త‌గ్గేదేలే అంటున్న‌ ప్ర‌గ్యా!

ప్ర‌గ్య‌ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసిన వీడియోలో బ్లాక్ అండ్ బ్లాక్ లుక్ లో క‌నిపించింది.

By:  Tupaki Desk   |   28 Jan 2024 9:36 AM GMT
కెరీర్ ముగిసినా త‌గ్గేదేలే అంటున్న‌ ప్ర‌గ్యా!
X

ప్రగ్యా జైస్వాల్ సోష‌ల్ మీడియాల్లో విపరీతమైన ఫాలోయింగ్‌ను ఆస్వాధిస్తున్న న‌టి కం మోడ‌ల్. ఈ బ్యూటీ తరచుగా వేడెక్కించే ఫోటోలు, వీడియోల తో ఇంటర్నెట్‌లో అగ్గి రాజేస్తోంది. ఈ రోజు ప్రగ్యా తన అంద‌చందాల‌ను ప్రదర్శించే వీడియోతో చెల‌రేగింది. ఇది కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై అభిమానులు ఘాటైన వ్యాఖ్య‌లు కురిపిస్తున్నారు.

ప్ర‌గ్య‌ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసిన వీడియోలో బ్లాక్ అండ్ బ్లాక్ లుక్ లో క‌నిపించింది. అందాల‌ను ఆరాంగా టూమ‌చ్ గా చూపించ‌డంలో త‌న‌ని కొట్టేవాళ్లే లేర‌ని నిరూపిస్తోంది. ఈ వీడియోను షేర్ చేసిన వెంటనే, అభిమానులు కామెంట్ సెక్షన్‌లో హార్ట్ ఎమోజీలతో చెల‌రేగారు. ప్ర‌గ్య టూ హాట్ గా ఉందంటూ పొగిడేసారు. బ్లాక్ ఇన్న‌ర్ ధ‌రించిన ప్ర‌గ్య పైన బ్లాక్ లెద‌ర్ కోట్, బాట‌మ్ వేర్ ని ధ‌రించి త‌న‌లోని హొయ‌ల‌ను ప్ర‌ద‌ర్శించింది.

ఇటీవ‌ల ఇన్ స్టాలో ప్ర‌గ్య ఇదే తీరుగా వ‌రుస ఫోటోషూట్ల‌తో చెల‌రేగుతోంది. ఇంత‌కుముందు ఎరుపు రంగు బికినీలో అల‌రించిన ఈ బ్యూటీ న్యూడ్ మేకప్ స్టేట్‌మెంట్ నెక్లెస్ సెట్‌తో గుబులు రేపింది. కొన్ని రోజుల క్రితం ప్ర‌గ్య‌ లండన్ వెకేష‌న్ నుండి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అక్క‌డ‌ ఎర్రటి హై-నెక్ స్వెటర్‌లో కనిపించింది. సూర్యుడు నేను లండన్‌లో ఒకే సమయంలో అడుగుపెట్టిన అరుదైన సందర్భం అని ప్ర‌గ్య టీజ్ చేసింది. అప్పుడు ఆ వీడియో వైర‌ల్ అయింది.

ప్రగ్యా 2014లో ద్విభాషా థ్రిల్లర్ చిత్రం విరాట్టుతో తొలిసారిగా నటించింది. కానీ 2015 పీరియడ్ డ్రామా కంచెలో కనిపించిన తర్వాత న‌టిగా పురోగతిని పొందింది. ఈ రొమాంటిక్ వార్ డ్రామా చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు. వరుణ్ తేజ్ ఇందులో క‌థానాయ‌కుడు. ఈ చిత్రం డీసెంట్ విజయాన్ని సాధించింది. ప్రగ్యా ఉత్తమ మహిళా డెబ్యూ సౌత్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా అందుకుంది. తరువాత, ఆమె టిటూ MBA, ఓం నమో వేంకటేశాయ, నక్షత్రం, అఖండ త‌దిత‌ర‌ చిత్రాలలో నటించింది. చివరిగా యాక్షన్ చిత్రం `సన్ ఆఫ్ ఇండియా`లో కనిపించింది. డైమండ్ రత్న బాబు రచన , దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ - 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై విష్ణు మంచు నిర్మించారు. ఈ చిత్రంలో మోహన్‌బాబు, మీనా, శ్రీకాంత్‌లు కీలక పాత్రలు పోషించారు. కానీ ఈ సినిమా కూడా ప‌రాభ‌వాన్ని మిగిల్చింది. అటుపై ప్ర‌గ్య కెరీర్ తెలుగులో ముగిసింది