Begin typing your search above and press return to search.

అప్పుడు ఏం చేయాలో అర్థం అయ్యేది కాదు : ప్రభాస్‌

ప్రభాస్ బాహుబలి 2 తర్వాత చేసిన సాహో, రాధేశ్యామ్‌, ఆదిపురుష్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి

By:  Tupaki Desk   |   26 Dec 2023 6:40 AM GMT
అప్పుడు ఏం చేయాలో అర్థం అయ్యేది కాదు : ప్రభాస్‌
X

ప్రభాస్ బాహుబలి 2 తర్వాత చేసిన సాహో, రాధేశ్యామ్‌, ఆదిపురుష్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. పాన్ ఇండియా స్టార్‌ దక్కించుకున్న ప్రభాస్ కు ఆ రేంజ్ సక్సెస్‌ పడటం లేదని ఆవేదనలో ఉన్న అభిమానులకు ప్రశాంత్ నీల్ సలార్ రూపంలో ఓ భారీ విజయాన్ని కట్టబెట్టాడు. బాహుబలి 2 ఇమేక్‌ కి తగ్గట్లుగా సలార్ ఉందనే టాక్ వచ్చింది.

సలార్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యం లో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీగా ఉన్నారు. బాహుబలి 2 తో ఇండియాలోనే కాకుండా జపాన్‌, ఇటలీ వంటి దేశాల్లో కూడా ప్రభాస్ కి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగింది. తాజాగా ఆ విషయాన్ని స్వయంగా ప్రభాస్ సలార్‌ ప్రమోషనల్‌ ఇంటర్వ్యూలో రాజమౌళి సాక్షిగా చెప్పాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ అవుతోంది.

ఆ వీడియో లో ప్రభాస్ మాట్లాడుతూ... బాహుబలి సినిమా తర్వాత ఇండియాతో పాటు విదేశాల్లో కూడా నన్ను గుర్తు పట్టారు. ఆ సమయంలో ఏం చేయాలి, ఏం మాట్లాడాలో కూడా అర్థం అయ్యేది కాదు. ఒకసారి ఇటలీ వెళ్లిన సమయంలో కొందరు నా వద్దకు వచ్చి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ప్రభాస్ ప్రభాస్ అంటూ వారు ఏదో చెబుతూ ఉంటే నా డ్రైవర్‌ ని పిలిచి ఏమంటున్నారో కనుక్కోమన్నాను.

వారు బాహుబలి సినిమా చూశామని, వారి వద్ద ఉన్న ఫోన్ లలో నా గురించిన విషయాలను చూపిస్తూ ఉన్నారు. రాజమౌళి ఏ స్థాయికి నన్ను తీసుకు వచ్చావు అని నేను ఆ సమయంలోనే అనుకున్నాను అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు. నిజంగానే బాహుబలి కారణంగా ప్రభాస్ పాన్‌ ఇండియా ని మించి పాన్‌ వలర్డ్‌ స్టార్‌ అయ్యాడు అనడంలో సందేహం లేదు.

తాజాగా సలార్ తో మళ్లీ ఆ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. వెయ్యి కోట్ల సినిమా అంటూ అభిమానులు మొదటి నుంచి చెబుతూ వచ్చారు. అన్నట్లుగానే ప్రభాస్‌ కి సలార్ సినిమా వెయ్యి కోట్ల వసూళ్లు తెచ్చి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజమౌళి బాహుబలి వల్లే తనకు పాన్ వలర్డ్ గుర్తింపు వచ్చిందని ప్రభాస్‌ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.