'ది రాజాసాబ్' డామిట్ కథ మళ్లీ మొదటికొచ్చిందా?
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీకి ప్రభాస్ డబ్బింగ్ ఒక్కటే బ్యాలెన్స్గా ఉంది.
By: Tupaki Desk | 10 May 2025 1:30 PMపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ని దృస్టిలో పెట్టుకుని చాలా వరకు నిర్మాణ సంస్థలు ఆయనతో సినిమాలు నిర్మిస్తున్నాయి. మరి కొంత మంది ఆయనతో సినిమాలు చేయాలని ఎదురు చూస్తున్నారు. కొంత మంది తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు. కొంత మంది అడ్వాన్స్లు కూడా ఇచ్చేసి ప్రభాస్ సిగ్నల్ కోసం వేచి చూస్తున్నారు. తను ఎప్పుడు సై అంటే అప్పుడు సినిమాలు మొదలు పెట్టాలని భావిస్తున్నారు. అయితే పీపుల్ మీడియా పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా మారింది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రభాస్ హీరోగా భారీ హారర్ థ్రిల్లర్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. `ది రాజా సాబ్` పేరుతో రూపొందుతున్న ఈ మూవీకి మారుతి దర్శకుడు. రొమాంటిక్ కామెడీ హారర్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ మూవీలో ప్రభాస్ కూడా ఘోస్ట్గా కనిపించి అదరగొట్టబోతున్నాడు. తాతగా, మనవడిగా రెండు విభిన్నమైన పాత్రల్లో ప్రభాస్ కనిపించనున్నారు. ఇందులో ప్రభాస్కు జోడీగా మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్దికుమార్ నటిస్తుండగా కీలక పాత్రలో సంజయ్దత్ కనిపించనున్నారు.
అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో నయనతార ఓ ప్రత్యేక గీతంలో మెరవనుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీకి ప్రభాస్ డబ్బింగ్ ఒక్కటే బ్యాలెన్స్గా ఉంది. అయితే విదేశాల్లో విహరిస్తున్న ప్రభాస్ ఈ మూవీ కోసం టైమ్ కేటాయించలేకపోతున్నారట. ఆ కారణంగానే ఈ మూవీ రిలీజ్తో పాటు టీజర్ రిలీజ్ అలస్యం అవుతూ వస్తోందని ఇన్ సైడ్ టాక్. ఇదిలా ఉంటే ఇటీవల ఈ మూవీ టీజర్ని ఈ నెలలోనే రనిలీజ్ చేస్తామంటూ టీమ్ ప్రకటించింది. అయితే అది జరిగేలా కనిపించడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.
కారణం ప్రభాస్ డబ్బింగ్ పూర్తి చేయకపోవడమేనని తెలుస్తోంది. ప్రస్తుతం ఇటలీ వెకేషన్లో ఉన్న ప్రభాస్ ఇండియాకు తిరిగి రావడానికిఅంతగా ఇష్టపడటం లేదట. కొన్ని రోజుల తరువాతే ఇండియా తిరిగిరావాలనుకుంటున్నాడట. దీంతో `ది రాజా సాబ్` టీజర్ రిలీజ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశమే ఎక్కువగా ఉందని, మేకర్స్ ఆందోళకు గురవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త అభిమానుల్ని కూడా కలవరానికి గురి చేస్తోంది.