Begin typing your search above and press return to search.

పూజా హెగ్డేకు బెదిరింపులు.. ఇది అసలు మ్యాటర్!

అయితే కొద్దీ సేపటికే ఆ వీడియో ను డిలీట్ చేశారు. అందులో నిజం లేదని పూజా టీమ్ నుంచి క్లారిటీ రావడంతో వెంటనే వీడియో అబద్ధం అని తేలిపోయింది.

By:  Tupaki Desk   |   13 Dec 2023 2:59 PM GMT
పూజా హెగ్డేకు బెదిరింపులు.. ఇది అసలు మ్యాటర్!
X

టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే కి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. పూజా హెగ్డేని చంపేస్తామని బెదిరింపులు వచ్చినట్లు ఉదయం నుంచి రకరకాలుగా వార్తలు అయితే వస్తున్నాయి. ఈ విషయాన్ని బాలీవుడ్ కు సంబంధించిన ఓ ఫోటోగ్రాఫర్ తన సోషల్ మీడియా వేదికగా తెలియజేసారు. దుబాయ్ లోని ఒక క్లబ్ లో తీవ్రమైన వాదనల తర్వాత పూజా హెగ్డే కి హత్యా బెదిరింపులు వచ్చినట్లు ఆ ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో ఓ పోస్ట్ చేశారు.

అయితే కొద్దీ సేపటికే ఆ వీడియో ను డిలీట్ చేశారు. అందులో నిజం లేదని పూజా టీమ్ నుంచి క్లారిటీ రావడంతో వెంటనే వీడియో అబద్ధం అని తేలిపోయింది. ఉదయం నుంచి ఈ విషయంలో అనేక రకాల ఫేక్ న్యూస్ లు పూజా ఫ్యాన్స్ ను కంగారు పెట్టాయి. పూజా హెగ్డే ఒక క్లబ్ ప్రారంభోత్సవం కోసం దుబాయ్ కి వెళ్ళిందని, దీంతో బెదిరింపుల అనంతరం ఇండియాకి తిరిగి వచ్చిందని అంటున్నట్లు సోషల్ మీడియాలో కూడా టాక్ గట్టిగానే వచ్చింది.

అసలు అక్కడ ఏం జరిగింది? పూజా హెగ్డే కి ఏ విషయంలో బెదిరింపులు వచ్చాయి? ఆమెను చంపేస్తామని బెదిరించింది ఎవరు? అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గట్టిగానే అడిగారు. ఇక విషయం పూజా హెగ్డే వరకు వెళ్లడంతో వెంటనే ఆమె టీమ్ ద్వారా క్లారిటీ వచ్చేసింది. ఎవరు ఈ ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారో తెలియదు కానీ, అలాంటి వాదనలు ఏమి జరగలేదు అని ప్రస్తుతం వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని వారు అన్నారు. దీంతో ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

ఇక ఇక పూజా హెగ్డే చివరగా సల్మాన్ ఖాన్ సరసన 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' సినిమాలో కనిపించింది. ఈ ఏడాది రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం అందుకుంది. గత కొంతకాలంగా పూజా హెగ్డే బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్స్ అందుకోవడంతో ఇండస్ట్రీలో ఆమె క్రేజ్ ఒక్కసారిగా పడిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కి జోడిగా 'దేవా' అనే సినిమాలో నటిస్తోంది పూజా హెగ్డే. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న ఈ కు రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాతో పాటూ హౌస్ ఫుల్ 5 మూవీలోనూ నటిస్తుంది. అక్షయ్ కుమార్, రితీష్ దేశ్‌ముఖ్, జాన్ అబ్రహం, అభిషేక్ బచ్చన్, బాబీ డియోల్, కృతి సనన్, కృతి కర్బందా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, దిశా పటానీ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాని కూడా వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.