Begin typing your search above and press return to search.

మరోసారి యూ టర్న్ తీసుకున్న పూజా హెగ్డే

ఇలాంటి సమయంలో నెట్ ఫ్లిక్స్ లో రెండు ప్రాజెక్ట్స్ చేసే ఛాన్స్ పూజా హెగ్డేకి వచ్చింది. అందులో లస్ట్ స్టోరీస్ సీజన్ 3 వెబ్ సిరీస్ కోసం మెయిన్ లీడ్ గా పూజాని ఎంపిక చేసారంట.

By:  Tupaki Desk   |   25 Dec 2023 3:34 AM GMT
మరోసారి యూ టర్న్ తీసుకున్న పూజా హెగ్డే
X

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోయిన అందాల భామ పూజా హెగ్డే. కెరియర్ ఆరంభంలో ముకుందా, ఒక లైలా కోసం సినిమాలతో ఫ్లాప్ లు సొంతం చేసుకుంది. తరువాత హిందీలోకి ఎంట్రీ ఇచ్చి హృతిక్ రోషన్ కి జోడీగా ఓ పీరియాడిక్ మూవీలో నటించింది. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో మళ్ళీ బాలీవుడ్ ఎంట్రీ కష్టమైంది. ఆ సమయంలో దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో తెలుగులో మొదటి సక్సెస్ అందుకుంది.

అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా వరుసగా స్టార్ హీరోలతో కమర్షియల్ సినిమాలు చేస్తూ వస్తోంది. అల వైకుంఠపురంలో వరకు పూజా హెగ్డేకి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ ఉన్నాయి. అయితే ప్రభాస్ తో చేసిన రాధేశ్యామ్ పాన్ ఇండియా మూవీ అయిన సక్సెస్ కాలేదు. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా పూజా హెగ్డే మారిపోతుందని అందరూ భావించారు.

దానికి విరుద్ధంగా మూవీ డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా తర్వాత హిందీలో రణవీర్ సింగ్ తో చేసిన సర్కస్ ఫ్లాప్ అయ్యింది. సల్మాన్ ఖాన్ తో జతకట్టిన రీమేక్ మూవీ కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. తమిళంలో విజయ్ తో నటించిన బీస్ట్ మూవీ ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. ఇలా వరుస ఫ్లాప్ లు పడేసరికి చేతిలో ఉన్న సినిమాలు జారిపోయాయి.

సూపర్ స్టార్ తో చేయాల్సిన గుంటూరు కారం ఛాన్స్ పోయింది. ఉస్తాద్ భగత్ సింగ్ అవకాశం శ్రీలీలకి వెళ్ళిపోయింది. దీంతో ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో సినిమాలేవీ లేవు. ఇలాంటి సమయంలో నెట్ ఫ్లిక్స్ లో రెండు ప్రాజెక్ట్స్ చేసే ఛాన్స్ పూజా హెగ్డేకి వచ్చింది. అందులో లస్ట్ స్టోరీస్ సీజన్ 3 వెబ్ సిరీస్ కోసం మెయిన్ లీడ్ గా పూజాని ఎంపిక చేసారంట.

అలాగే అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఏవీఎం ప్రొడక్షన్స్ నిర్మించబోయే లేడీ ఒరియాంటెడ్ సినిమాకి పూజా హెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. నెట్ ఫ్లిక్స్ కోసం ఈ మూవీ తెరకెక్కిస్తున్నారంట. త్వరలో ఈ రెండు ప్రాజెక్ట్స్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.