Begin typing your search above and press return to search.

మరో మూవీ నుంచి పూజ ఔట్.. మళ్లీ ఏమైంది?

అయితే అంతా ఫైనల్ అయ్యాక ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నటించడం ఇష్టం లేకే పూజ ఈ నిర్ణయం తీసుకుందట.

By:  Tupaki Desk   |   1 Feb 2024 3:13 PM GMT
మరో మూవీ నుంచి పూజ ఔట్.. మళ్లీ ఏమైంది?
X

టాలీవుడ్ పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డేకి గత కొన్ని నెలలుగా సినీ అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. డీజే తర్వాత సౌత్ లో సెన్సేషనల్ హీరోయిన్ గా ఎదిగిన పూజా హెగ్డే అనేక విజయాలు సొంతం చేసుకుంది. డీజే, అరవింద సమేత, మహర్షి, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురంలో లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ దక్కించుకుంది.

ఆ తర్వాత పూజకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. ఆమె నటించిన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలు వరుసగా ప్లాపులు అయ్యాయి. హిందీలో సల్మాన్ తో నటించిన కిసీకి భాయ్ కిసీకి జాన్ చిత్రం కూడా ఆశించిన ఫలితం రాలేదు. దీంతో పూజా హెగ్డేకి ఒక్కసారిగా దారులన్నీ మూసుకుపోయాయి. చేతిలో ఉన్న ఛాన్సులు కూడా మిస్ అయ్యాయి.

హరీశ్ శంకర్- పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ముందుగా పూజా హెగ్డేను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆ ప్లేస్ లోకి శ్రీలీల వచ్చింది. ఇటీవలే సంక్రాంతికి వచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేశ్ బాబు గుంటూరు కారం చిత్రం నుంచి కూడా పూజా హెగ్డే తప్పుకుంది. అలాగే మరికొన్ని అవకాశాలు కూడా చేజారాయి. ఇప్పుడు ఈ బ్యూటీ మరో క్రేజీ చిత్రం నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

సాయిధరమ్ తేజ్, సంపత్ నంది కాంబినేషన్ లో గంజా శంకర్ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ అని ముందుగా వార్తలు వచ్చాయి. అయితే అంతా ఫైనల్ అయ్యాక ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నటించడం ఇష్టం లేకే పూజ ఈ నిర్ణయం తీసుకుందట. ఈ చిత్రం నుంచి తప్పుకోవడం వెనుక ఒక కారణం ఉందట.

ఈ మూవీలో హీరోయిన్ ఎక్కువ సమయంలో జైలులో ఖైదీగా కనిపించాలట. అది కూడా వైట్ శారీలో డీగ్లామర్ లో కనిపించాల్సి ఉంటుందట. ఎప్పుడూ గ్లామర్ పాత్రలు చేసేందుకు ఇష్టపడే పూజా హెగ్డేకి ఆ రోల్ నచ్చలేదట. అందుకే ముందుగానే గంజా శంకర్ చిత్రం నుంచి ఆమె తప్పుకుందట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.