Begin typing your search above and press return to search.

'పెద‌కాపు' బ్యూటీ కండీష‌న్ల‌తో టాలీవుడ్ ఎంట్రీ!

తాజాగా ముంబై నుంచి దిగుమ‌తి అయిన 'పెద‌కాపు' బ్యూటీ ప్ర‌గ‌తి శ్రీ వాస్త‌వ సినిమాల్లోకి రావ‌డానికి కండీష‌న్ల‌తోనే ఎంట్రీ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   26 Sep 2023 11:30 AM GMT
పెద‌కాపు బ్యూటీ కండీష‌న్ల‌తో టాలీవుడ్  ఎంట్రీ!
X

సెల‌బ్రిటీ కుటుంబం నుంచి ఎంట్రీ ఇచ్చే స్టార్స్ కిడ్స్ విష‌యంలో ఫ్యామిలీ నుంచి అన్ని ర‌కాల స‌హ‌కారం ఉంటుంది. ఎందుకంటే ఇండ‌స్ట్రీలో ఎలా ఉంటుంద‌న్న‌ది ముందుగానే అవ‌గాహ‌న ఉంటుంది. ఆ ప్ర‌కారం ఇన్ సైడ్ న‌డుచుకోవాల్సి ఉంటుంద‌ని పెద్ద‌ల‌కు తెలుసు. స్టార్ కిడ్స్ విషయంలో పెద్దగా ఇబ్బందులు కూడా ఎదుర‌వ్వ‌వు. ఒక‌వేళ ఎదురైనా అర్దం చేసుకునే త‌ల్లిదండ్రులు ఉంటారు కాబ‌ట్టి అదేం పెద్ద స‌మస్య‌గా భావించ‌రు. అయితే ఔట్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ నుంచి వ‌చ్చే భామ‌ల విష‌యంలో మాత్రం కొంత స్థ‌బ్ధ‌త అయితే ఉంటుంది.

మోడ‌లింగ్ వ‌ర‌కూ ఒకే కానీ...సినిమాల్లోకి వెళ్తానంటే తొంద‌ర‌గా అంగీక‌రించే ప‌రిస్థితి ఉండ‌దు. అలా జ‌ర‌గాలంటే కుటుంబ స‌భ్యుల్ని ఒప్పించడం అన్న‌ది పెద్ద విష‌య‌మే. అమ్మ‌-నాన్న‌ల్ని ఒప్పించి మ్యాక‌ప్ వేసుకోవాలంటే కుమార్తులు చాలా విష‌యాల్లో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. తాజాగా ముంబై నుంచి దిగుమ‌తి అయిన 'పెద‌కాపు' బ్యూటీ ప్ర‌గ‌తి శ్రీ వాస్త‌వ సినిమాల్లోకి రావ‌డానికి కండీష‌న్ల‌తోనే ఎంట్రీ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

సినిమాలంటే ప్ర‌గతి తండ్రి ముందుగా ఒప్పుకోలేదుట‌. ఎవ‌రూ ఆ రంగంలో లేరు...పైగా రంగుల ప్ర‌పంచం ఎలా ఉంటుందో న‌ని టెన్ష‌న్ ప‌డ్డారుట‌. అయితే అన్నిర‌కాల ప‌రిస్థితులు తండ్రికి వివ‌రించి ఒప్పించిందిట‌. తెర‌పై త‌న‌ని ఎప్పుడు చూసిన తండ్రి గ‌ర్వ‌ప‌డే పాత్ర‌లు చేస్తాను త‌ప్ప‌! ప్ర‌తీ పాత్ర‌కి సైన్ చేయ‌ను అంటోంది. నాన్న‌కి ఇష్టం లేని ఎలాంటి పాత్ర‌లు చేయ‌న‌ని ఇంట్లో ప్రామిస్ చేసి వ‌చ్చిందిట‌.

బ‌ల‌మైన భావోద్వేగాల‌తో నిండిన కుటుంబ క‌థా చిత్రాలు ఎక్కువ‌గా చేస్తుందిట‌. అలాగే స‌మంత‌.. త్రిష‌...తాప్సి సినిమాలు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డి చూస్తుందిట‌. ప్ర‌భాస్..రామ్ చ‌ర‌ణ్‌..వ‌రుణ్ తేజ్ ల‌తో క‌లిసి ప‌నిచేయాలి అన్న ఆస‌క్తిని వెల్లుబుచ్చింది. ప్ర‌స్తుతం 'గం గం గ‌ణేష‌'లో న‌టిస్తున్నానంది. అలాగే కొత్త ప్రాజెక్ట్ లు చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయ‌ని తెలిపింది. పెద‌కాపు సినిమాతో త‌న‌ని తాను నిరూపించుకునే పాత్ర ద‌క్కిందని..త‌న న‌మ్మ‌కం నిల‌బ‌డుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేసింది.