తమ్ముడు సీన్ లోకి వచ్చి అన్నయ్యని టెన్షన్ పెడుతున్నాడా?
ఎప్పుడొచ్చాం కాదన్నయ్యా...బుల్లెట్ దిగిందా? లేదా? అన్నది ఇంపార్టెంట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే తీరున కనిపిస్తున్నారు. ఆలస్యమైంత కాలం అతడి సినిమాలు సంవత్సరాల పాటు సాగాయి.
By: Tupaki Desk | 26 May 2025 6:35 AMఎప్పుడొచ్చాం కాదన్నయ్యా...బుల్లెట్ దిగిందా? లేదా? అన్నది ఇంపార్టెంట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే తీరున కనిపిస్తున్నారు. ఆలస్యమైంత కాలం అతడి సినిమాలు సంవత్సరాల పాటు సాగాయి. కానీ పనిగట్టుకుని ఆయన రంగలోకి దిగితే సీన్ ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. ఇప్పటికే 'హరిహర వీరమల్లు' షూటింగ్ పూర్తయింది. జూన్ 12న ఆ సినిమా రిలీజ్ అయిపోతుంది.
`ఓజీ` షూటింగ్ కూడా షురూ చేసారు. ఆయన సెట్స్ కు వెళ్లడం ఇలా మొదలైందో? లేదో? సెప్టెంబర్ 25న రిలీజ్ అంటూ ప్రకటన వచ్చేసింది. ఆ తేదీకి రిలీజ్ తప్పనిసరి అని యూనిట్ స్ట్రాంగ్ గా చెబుతుంది. ఈ రెండు సినిమాలు భారీ విజయం సాధిస్తాయి? అన్న నమ్మ కం బలంగా ఉంది అలాగే 'ఉస్తాద్ భగత్ సింగ్' ను కూడా రెడీగా ఉండమన్నాడు పవన్ . 'ఓజీ' ముగించిన అనంతరం ఉస్తాద్ ని పట్టాలెక్కిస్తారు.
ఇలా ఒక్కసారిగా పీకే సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయారు. ఈ క్రమంలో చిరంజీవి 'విశ్వంభర' రిలీజ్ ఎప్పుడు? అంటూ పవన్ సినిమాలతో ముడి పెట్టి మాట్లాడటం నెట్టింట మొదలైంది. తమ్ముడు అంటే రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు కాబట్టి సినిమాల విషయంలో డిలే జరిగింది. మరి అన్నయ్య సినిమా ల్లోనే బిజీగా ఉండి? ఎందుకు 'విశ్వంభర' రిలీజ్ చేయలేకపోతున్నారు? అన్న వాదన తెరపైకి వచ్చింది.
జనవరిలో రిలీజ్ అవ్వాల్సిన సినిమా పోస్ట్ ప్రొడక్షన్ డిలే కారణంగా ఆలస్యమైనా? మరీ ఐదు నెలలు గడిచే వరకూనా? చివరికి చిరంజీవి 157వ సినిమా కూడా పట్టాలెక్కింది. మరి 'విశ్వంభర' ఉంటుందా? ఉండదా? అంటూ కౌంటర్ ఎటాక్ మొదలైంది. ఇంత వరకూ కొత్త రిలీజ్ తేదీని 'విశ్వంభర' టీమ్ ప్రకటించకపోవడంతోనే ఒత్తిడి మొదలైంది. సెప్టెంబర్ ..అక్టోబర్ అంటూ రిలీజ్ విషయంలో ప్రచారం జరుగు తున్నా? అంత వరకూ అంటే అభిమానులు శాంతించేలా కనిపించలేదు. జూన్ మిస్ అయినా జూలైలో నైనా రిలీజ్ ఉంటుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఆ మాసం కూడా మిస్ అయితే మరింత ఒత్తిడి తప్పదని ఫిలిం సర్కిల్స్ లో చర్చకు దారి తీసింది.