Begin typing your search above and press return to search.

బాహుబ‌లి 2పై ప‌రిణితి చోప్రా సీరియ‌స్!

మేరీ ప్యార్ బిందూ' సినిమాకి మంచి టాక్ వ‌చ్చినా 'బాహుబ‌లి-2 'సినిమా ముందు నిల‌వ‌లేక పోయింద‌ని

By:  Tupaki Desk   |   23 Sep 2023 4:36 AM GMT
బాహుబ‌లి 2పై ప‌రిణితి చోప్రా సీరియ‌స్!
X

భారీ అంచ‌నాల మ‌ధ్య పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ఆ ప్ర‌భావం ఆ సినిమాతో పాటు రిలీజ్ అయ్యే ఇత‌ర చిత్రాల‌పై తప్ప‌క ప‌డుతుంది. ఆయా చిత్రాల‌కు మంచి టాక్ వ‌చ్చినా పాన్ ఇండియా చిత్రాల ముందు నిల‌బ‌డ‌టం క‌ష్ట‌మైన ప‌నే. వాటికి చాలా ప‌రిమితంగానే థియేట‌ర్లు కూడా దొరుకుతాయి కాబ‌ట్టి సినిమా కిల్ అవ్వ‌డానికి అవ‌కాశం ఎక్కువ ఉంటుంది. అలా కాకుడ‌దంటే పాన్ ఇండియా సినిమా డిజాస్ట‌ర్ అవ్వాలి.

అప్పుడే హిట్ టాక్ తెచ్చుకున్న చిన్న సినిమాల‌కు మైలేజ్ ఉంటుంది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ ప‌రిణితి చోప్రా తాను న‌టించిన ఓ సినిమా విష‌యంలో ఇలాంటి చేదు అనుభ‌వాన్నే ఎదుర్కోవాల్సి వ‌చ్చింద‌ని వాపోయింది. ప‌రిణితిచోప్రా హీరోయిన్ గా న‌టించిన 'మేరీ ప్యారీ బిందు' అనే ఓ సినిమా రిలీజ్ అయింది. స‌రిగ్గా ఈ సినిమా కూడా పాన్ ఇండియా చిత్రం 'బాహుబ‌లి -2' రిలీజ్ స‌మ‌యంలోనే జ‌రిగింది.

ఇలా రెండు సినిమాలు ఒకేసారి ప్రేక్ష‌కుల ముందుకొచ్చేస‌రికి ప‌రిణితి సినిమాకి ఆటంకాలు ఎదుర‌య్యా య‌ని..అందుకు కార‌ణం 'బాహుబ‌లి 2' అని అస‌హాన్ని వ్య‌క్తం చేసిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

వాస్త‌వానికి 'బాహుబ‌లి2' కంటే ముందే త‌మ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారుట‌. ఆ తేదీ ప్ర‌క‌టించిన నెల రోజుల త‌ర్వాత 'బాహుబ‌లి 2' ప్ర‌క‌టించారుట‌. దీంతో బాహుబ‌లి 2 పెద్ద సినిమా అవ్వ‌డం..పైగా హిట్ అవ్వ‌డంతో త‌మ సినిమా కిల్ అయిందంటోంది.

'మేరీ ప్యార్ బిందూ' సినిమాకి మంచి టాక్ వ‌చ్చినా 'బాహుబ‌లి-2 'సినిమా ముందు నిల‌వ‌లేక పోయింద‌ని..ఆ కార‌ణంగా త‌న‌లాంటి న‌టీమణులు ఎంతో మంది న‌ష్ట‌పోవాల్సి వ‌చ్చింద‌ని అంది. ఆ సినిమాతో త‌న‌కి ఇండ‌స్ట్రీలో ప్ర‌త్యేక‌మైన గుర్తింపు వ‌చ్చింద‌ని..అందుకు కార‌ణంగా ఆ సినిమాలో పాత్ర‌తోనే సాధ్య‌మైంద‌ని తెలిపింది. అలాంటి సినిమాలు థియేట‌ర్లో త‌ప్పక ఆడాల‌ని...బాహుబ‌లి లాంటి సినిమాల వ‌ల్ల ఇత‌ర సినిమాలు ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌ని...రిలీజ్ విష‌యంలో అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించింది.