Begin typing your search above and press return to search.

2023 చివరలో టాలీవుడ్ స్టార్స్ యమ బిజీ..

పాన్ ఇండియా ట్రెండ్ స్టార్ట్ అయ్యింది టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి

By:  Tupaki Desk   |   25 July 2023 6:24 AM GMT
2023 చివరలో టాలీవుడ్ స్టార్స్ యమ బిజీ..
X

పాన్ ఇండియా ట్రెండ్ స్టార్ట్ అయ్యింది టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాహుబలితో రాజమౌళి ఇండియన్ మార్కెట్ మొత్తాన్ని మన కథలతో మెప్పించవచ్చని చూపించారు. దానిని ప్రశాంత్ నీల్ అనుసరించి కేజీఎఫ్ సిరీస్ తో బ్లాక్ బస్టర్ కొట్టారు. దీంతో టాలీవుడ్ నిర్మాతలకి ధైర్యం వచ్చింది. వందల కోట్ల బడ్జెట్ పెట్టిన కూడా తిరిగి కలెక్ట్ చేయవచ్చనే కాన్ఫిడెన్స్ ని జక్కన్న అందరికి ఇచ్చాడు.

ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు అత్యధికంగా తయారవుతున్న ఇండస్ట్రీగా టాలీవుడ్ కనిపిస్తోంది. హిందీ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోలు డేర్ చేయలేకపోతున్నారు. కానీ మన సౌత్ ముఖ్యంగా తెలుగు హీరోలు మాత్రం యూనివర్శల్ కథలతో సత్తా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత యూనివర్సల్ స్టార్స్ గా మారిపోయిన తారక్, రామ్ చరణ్ నుంచి రాబోయే సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లోనే ఉన్నాయి.

చరణ్ గేమ్ చేంజర్, తారక్ దేవర చిత్రాలతో తమ సత్తా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే తారక్ ఈ ఏడాది చివర్లో హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వార్ 2 మూవీ షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నాడు. దీనికోసం డిసెంబర్ నుంచి తారక్ డేట్స్ ఇచ్చారు. రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాని ఈ ఏడాది ఆఖరులో సెట్స్ పైకి తీసుకొని వెళ్లనున్నారు.

మరో వైపు అల్లు అర్జున్ పుష్ప 2 చేస్తున్నారు. దీని తర్వాత త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గానే సిద్ధమని కానుంది. మహేష్ బాబు జక్కన్నతో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కోసం సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఆఖరులో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ కాబోతోంది. యంగ్ రెబల్ స్టార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ అందుకుంటున్న స్టార్ గా ఉన్నాడు. కల్కి 2898 ఏడీతో ప్రపంచం మొత్తం అతని గురించి చర్చించుకునే ఛాన్స్ ఉంది.ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓజీ మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గానే సిద్ధం అవుతోంది. అలాగే హరిహరవీరమల్లు లైన్ లోనే ఉంది.

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో చేయబోయే సినిమాని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గానే సెట్స్ పైకి తీసుకొని వెళ్లనున్నారు. ఈ ఏడాది చివరిలో ఈ మూవీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. వీరితో పాటుగా మాస్ మహారాజ్ రవితేజ పాన్ ఇండియా లెవల్ లో తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. అలాగే కళ్యాణ్ రామ్ డెవిల్, నిఖిల్ ది ఇండియా హౌస్, స్వయంభు సినిమాలతో పాన్ ఇండియా లెవల్ లో సత్తా చాటడానికి సిద్ధం అవుతున్నారు. మొత్తానికి ఈ ఏడాది చివర్లో టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరూ పాన్ ఇండియా సినిమాల దేశ వ్యాప్తంగా ప్రేక్షకులని అలరించడానికి సిద్ధం అవుతున్నారు.