Begin typing your search above and press return to search.

జైలు నుంచి వచ్చిన పల్లవి ప్రశాంత్‌ ఏం చేస్తున్నాడు..?

పల్లవి ప్రశాంత్ కు బెయిల్‌ దక్కిన వెంటనే ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్ గా ఇంటికి చేరుకున్నాడు. ఆయన ఇంటి వద్ద అప్పటికే ఉన్న మీడియా వారిని అక్కడ నుంచి పంపించేశారు.

By:  Tupaki Desk   |   24 Dec 2023 7:44 AM GMT
జైలు నుంచి వచ్చిన పల్లవి ప్రశాంత్‌ ఏం చేస్తున్నాడు..?
X

తెలుగు బిగ్‌ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్‌ అనూహ్య పరిణామాల నేపథ్యం లో జైలుకు వెళ్లిన విషయం తెల్సిందే. ఆయనకు బెయిల్‌ దక్కడంతో జైలు నుంచి నేరుగా ఇంటికి వెళ్లి పోయాడు. బెయిల్‌ ఇచ్చే సమయంలో పల్లవి ప్రశాంత్ కు కోర్టు కొన్ని కండిషన్స్ ను పెట్టింది. ఆ కండీషన్స్ ను క్రాస్‌ చేస్తే బెయిల్‌ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మీడియా సమావేశాలు నిర్వహించడం, ఫ్యాన్స్ తో మీటింగ్‌ వంటివి చేయకూడదు అంటూ పల్లవి ప్రశాంత్‌ కు కోర్టు సూచించింది. అంతే కాకుండా విచారణ జరుగుతున్న కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను ప్రభావితం చేయకూడదు అంటూ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగిందని పల్లవి ప్రశాంత్ తరపు న్యాయవాదులు తెలియజేశారు.

పల్లవి ప్రశాంత్ కు బెయిల్‌ దక్కిన వెంటనే ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్ గా ఇంటికి చేరుకున్నాడు. ఆయన ఇంటి వద్ద అప్పటికే ఉన్న మీడియా వారిని అక్కడ నుంచి పంపించేశారు. అంతే కాకుండా మీడియా వారు రావద్దని ఆయన కుటుంబ సభ్యులు కూడా విజ్ఞప్తి చేశారు.

ఇంటికి చేరుకున్న పల్లవి ప్రశాంత్‌ ప్రస్తుతానికి పూర్తి విశ్రాంతి తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆయన ఫ్యాన్స్ ను కలవడం, ఇతర ప్లాన్స్ అన్నీ కూడా రద్దు చేసుకున్నాడు. మరి కొన్ని రోజుల్లో వ్యవసాయ పనులతో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం అందుతోంది.

పల్లవి ప్రశాంత్‌ యొక్క ఫ్యామిలీ మెంబర్స్‌ కూడా మీడియా కు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. బెయిల్‌ పై ఉన్న పల్లవి ప్రశాంత్ నెలలో రెండు సార్లు పోలీస్ స్టేషన్ లో హాజరు వేయించుకోవాల్సి ఉంటుంది. అనుమతి లేకుండా రాష్ట్రం వీడవద్దని కూడా కోర్టు కండీషన్ పెట్టింది. కనుక పల్లవి ప్రశాంత్‌ ప్రస్తుతం.. కొన్నాళ్ల వరకు తన ఊరికే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి.