Begin typing your search above and press return to search.

పారిజాతపర్వం.. ఫన్ ట్రైలర్ తో ట్రెండింగ్ షురూ

క్రైమ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ గా రానున్న 'పారిజాతపర్వం' కు 'కిడ్నాప్‌ ఈజ్‌ ఏన్‌ ఆర్ట్‌' అనేది క్యాప్షన్ గా ఇచ్చారు. సంతోశ్‌ కంభంపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను మహీధర్‌రెడ్డి, దేవేశ్‌ నిర్మిస్తున్నారు.

By:  Tupaki Desk   |   13 April 2024 4:23 AM GMT
పారిజాతపర్వం.. ఫన్ ట్రైలర్ తో ట్రెండింగ్ షురూ
X

డిఫరెంట్ వెబ్ సీరీస్ లతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నాడు చైతన్యరావు. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతున్న ఈ యాక్టర్ కథల విషయంలో కూడా డిఫరెంట్ గా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ చైతన్య నుంచి రాబోతున్న సినిమా పారిజాతపర్వం. సునీల్‌, శ్రద్ధాదాస్‌, మాళవిక సతీశన్‌ లాంటి టాలెంటెడ్ స్టార్స్ కూడా ఇందులో ప్రధానపాత్రధారులుగా కనిపించబోతున్నారు.

క్రైమ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ గా రానున్న ‘పారిజాతపర్వం’ కు ‘కిడ్నాప్‌ ఈజ్‌ ఏన్‌ ఆర్ట్‌’ అనేది క్యాప్షన్ గా ఇచ్చారు. సంతోశ్‌ కంభంపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను మహీధర్‌రెడ్డి, దేవేశ్‌ నిర్మిస్తున్నారు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ట్రైలర్‌ ని విడుదల చేశారు. ఇక ట్రైలర్ లో అన్ లిమిటెడ్ ఫన్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక విడుదలైన కొన్ని గంటలకే ట్రైలర్ పై అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

గత 48 గంటల నుంచి యూట్యూబ్ లో ట్రైలర్ కు వస్తున్న రెస్పాన్స్ తో మేకర్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. టాప్ ట్రేండింగ్ లిస్ట్ అంటూ ట్రైలర్ ను మరింత ప్రమోట్ చేస్తున్నారు. ట్రైలర్ ఎలా ఉంది అనే వివరాల్లోకి వెళితే.. కేక్‌ కట్‌ చేసేటప్పుడు లైట్స్‌ ఆర్పుతారట.. మళ్లీ లైట్స్‌ వేసేలోపు కేక్‌తోపాటు వాళ్ల ఆవిడ కూడా మన బండిలో ఉండాలి’ అని సునీల్‌ తన గ్యాంగ్‌ తో కిడ్నాప్‌ ప్లాన్‌ చెబుతుండగా ట్రైలర్‌ మొదలైంది.

ట్రైలర్‌ కామెడీతో బాగా హైలెట్ అయ్యింది. కిడ్నాప్ కు సంబంధించిన ప్లాన్ అలాగే ఎదురయ్యే సవాళ్ళు వాటి నుంచి బయట పడేందుకు చేసే ప్రయత్నాలు ట్రైలర్ లో ఆకట్టుకున్నాయి. ఇక ఆర్టిస్టులా కిడ్నాప్ ప్లాన్ అలాగే డబ్బు పాయింట్ తో సినిమా ఆసక్తిగా ఉండబోతున్నట్ల అర్ధమవుతోంది. వైవా హర్ష, చైతన్య కాంబినేషన్ సీన్స్ కూడా ఫన్నీ గా ఉన్నాయి. సోషల్ మీడియా మీమ్స్ ను కూడా గట్టిగానే వాడారు.

మేయిన్ క్యారెక్టర్ల చుట్టూ నడిపిన కిడ్నాప్‌ సీక్వెన్స్‌లు, అలాగే మరికొన్ని డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. ఇక శ్రద్దా దాస్ యాక్షన్‌, గ్లామర్ డోస్ కూడా మరింత హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఆడియెన్స్ కు కావాల్సిన అన్ని రకాల ఎలిమెంట్స్‌తో సినిమా అలరిస్తుందని మేకర్స్‌ నమ్మకంతో ఉన్నారు. పారిజాతపర్వం సినిమా ఈ నెల 19న విడుదల కాబోతోంది. వైవా హర్ష, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సురేశ్‌వాణి, సమీర్‌, గుండు సుదర్శన్‌, తోటపల్లి మధు ఇతర ప్రముఖ ఆర్టిస్టులు ఈ సినిమాలో కనిపించబోతున్నారు.