ఇండియాలో పాకిస్తానీ స్టార్లకు ఇక ఛాన్సే లేదు
పాకిస్తాన్పై `ఆపరేషన్ సింధూర్` ప్రభావం పొరలు పొరలుగా విస్తరించి ఉంది. పాక్ పై ఇండియన్ ఆర్మీ ఆధిపత్యం చాలా స్పష్ఠంగా కనిపిస్తోంది.
By: Tupaki Desk | 9 May 2025 9:28 AM ISTపాకిస్తాన్పై `ఆపరేషన్ సింధూర్` ప్రభావం పొరలు పొరలుగా విస్తరించి ఉంది. పాక్ పై ఇండియన్ ఆర్మీ ఆధిపత్యం చాలా స్పష్ఠంగా కనిపిస్తోంది. అయితే వార్ సంగతి ఎలా ఉన్నా పాకిస్తాన్ లోని కళాకారులకు ఇది తీవ్ర సంకటంగా మారింది. నిజానికి పహల్గామ్ టెర్రర్ ఎటాక్కి ముందే పాకిస్తానీ నటీనటులకు భారతీయ సినీపరిశ్రమలో అవకాశాలు కల్పించకూడదని, వారిపై నిషేధం విధించాలని పెద్ద ఉద్యమమే నడిచింది. తీవ్రవాదుల ఘాతుకం తర్వాత అది మరింత రచ్చకెక్కింది. పలువురు ప్రముఖ పాకిస్తానీ స్టార్లు బాలీవుడ్ లో ఉపాధి పొందుతున్నారు. వారికి భారత్ లోను ఫాలోయింగ్ ఉంది. కానీ ఇప్పుడు అది అంతా సజీవ సమాధిగా మారింది. అభిమానం స్థానంలో వికృత విరోధం పుట్టుకొచ్చింది. ఈ పర్యవసానం ఇక పాక్ కళాకారులు ఎప్పటికీ భారతదేశంలో ఉపాధి పొందలేరు. ఇక్కడ పాక్ నటీనటులకు ఇకపై అవకాశాలు సున్నా. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా పాక్ ఉగ్రమూకల భరతం పట్టిన భారత సైన్యం, లాహోర్ లో జండా పాతడం సంచలనమైంది. కానీ దీనిని పాక్ కళాకారులు, ఆర్టిస్టులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అలాంటి వారిలో హహీరా ఖాన్, ఫవాద్ ఖాన్, మునీబ్ భట్, బుస్రా అన్సారీ, మావ్రా హోకేన్, ఫహద్ ముస్తఫా, డానిష్ తైమూర్, ఖుబ్రా ఖాన్ తదితరులు తదితరులు ఉన్నారు.
రయీస్ నటి మహిరా ఖాన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో భారత దాడిని `నిజంగా పిరికితనం` అని అభివర్ణించింది. ఈ నటి అల్లాను ప్రార్థిస్తూ..అల్లా మన దేశాన్ని రక్షించుగాక.. దీనిని మనం బాగా అర్థం చేసుకోవాలి.. అమీన్! అని వ్యాఖ్యను జోడించింది. మరో పాక్ ప్రముఖ నటి హనియా అమీర్ తమపై దాడిని ఖండిస్తూ, తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసింది. పహల్గామ్పై దాడిని సెలబ్రేట్ చేసుకుంటున్న ఏ పాకిస్తానీ వ్యక్తిని నేను చూడలేదు.. కానీ లెక్కలేనన్ని భారతీయులు ట్విట్టర్ లో అమాయక ప్రజల మరణాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు! అని రాసారు.
పాక్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన సినిమా భారతదేశంలో యుద్ధానికి ముందే విడుదల కావాల్సి ఉండగా, దాని రిలీజ్ సందిగ్ధంలో పడిన సంగతి తెలిసిందే. ఫవాద్ ఖాన్ తమ దేశంపై దాడికి తల్లడిల్లిపోయాడు. పాకిస్తాన్ - భారతదేశం ఇరు దేశాల్లోను ప్రజాదరణ పొందిన ఫవాద్ సోషల్ మీడియాల్లో తన ఆవేదనను వ్యక్తం చేసాడు. ఈ అవమానకరమైన దాడిలో గాయపడిన మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి.. అని రాసాడు. భారత్ ఆపరేషన్ను స్పష్టంగా ఖండించాడు.
నటుడు మునీబ్ బట్ ``పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది`` అని తీవ్రంగా ప్రకటించాడు. భారతదేశ చర్యలు రెచ్చగొట్టేవి, అన్యాయమైనవి అని విమర్శించారు. చాలామంది నటీనటులు అల్లా తమను రక్షించాలని ప్రార్థించారు. పాకిస్తాన్ జిందాబాద్ అని కొందరు అన్నారు. పాక్ నటీనటులు యుద్ధంపై తమ ఆవేదనను వ్యక్తం చేయగా, పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకున్న భారతీయ సైన్యానికి మన సెలబ్రిటీలు సెల్యూట్ కొడుతున్నారు.