'ఆపరేషన్ సిందూర్' మూవీ.. ఎవరు తీస్తున్నారంటే?
ఇంతలో ఆపరేషన్ సిందూర్ టైటిల్ తో మూవీ అనౌన్స్మెంట్ వచ్చేసింది. అందుకు సంబంధించిన పవర్ ఫుల్ పోస్టర్ ఇప్పుడు వైరల్ గా మారింది.
By: Tupaki Desk | 10 May 2025 4:52 AMభారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు చనిపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టగా, దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అది తట్టుకోలేక పాకిస్తాన్ దాడులు చేస్తుండగా, భారత్ సమర్థవంతంగా తిప్పి కొడుతోంది.
అలా ఆపరేషన్ సిందూర్ పేరు ఇప్పుడు మార్మోగుతోంది. అదే సమయంలో ఆపరేషన్ సిందూర్ పై సినిమా తీయాలని బాలీవుడ్ మేకర్స్ పోటీపడడం స్టార్ట్ చేశారు. ఏకంగా టైటిల్ కోసం 15 మంది సినీ దర్శక నిర్మాతలు రిజిస్టర్ చేసుకున్నారు. ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ లో దరఖాస్తు చేసుకున్నారు.
జీ స్టూడియోస్, టీ-సిరీస్ లాంటి కొన్ని బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు పోటీపడ్డాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన జియో స్టూడియోస్ దరఖాస్తు చేసుకుని వెనక్కి తగ్గింది. ఇంతలో ఆపరేషన్ సిందూర్ టైటిల్ తో మూవీ అనౌన్స్మెంట్ వచ్చేసింది. అందుకు సంబంధించిన పవర్ ఫుల్ పోస్టర్ ఇప్పుడు వైరల్ గా మారింది.
ఉత్తమ్ నితిన్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను నిక్కీ విక్కీ భగ్నానీ ఫిల్మ్స్ బ్యానర్ నిర్మిస్తోంది. పోస్టర్ లో ఓ మహిళను చూపించారు. సైనిక యూనిఫామ్ వేసుకుని.. రైఫిల్ పట్టుకుని.. నుదుటున సింధూరం పెట్టుకుని ఆమె కనిపించారు. బ్యాక్ గ్రౌండ్ లో ఫైటర్ జెట్స్ తో పాటు యుద్ధభూమిని కళ్లకు కట్టినట్లు చూపించారు.
అయితే సినిమాలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు, పహల్గాం ఘటన సహ పలు విషయాలను మేకర్స్ చూపించనున్నారని క్లియర్ గా తెలుస్తోంది. త్వరలోనే మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు మేకర్స్ అనౌన్స్ చేయనున్నారని సమాచారం. మెయిన్ క్యాస్టింగ్ ను ఇప్పటికే ఫిక్స్ చేసినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
అదే సమయంలో పోస్టర్ నెట్టింట వైరల్ గా మారడంతో నెటిజన్లు ఇప్పుడు స్పందిస్తున్నారు. కొందరు పోస్టర్ ను కొనియాడుతుండగా.. మరికొందరు ఇలాంటి సమయంలో మూవీ అనౌన్స్మెంట్ కు తొందరేంటని క్వశ్చన్ చేస్తున్నారు. యుద్ధ వాతావరణం నెలకొనగా, ఇప్పుడు సినిమా తొందర లేదుగా కదా అని అభిప్రాయపడుతున్నారు. అలా ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ మూవీ పోస్టర్ హాట్ టాపిక్ గా మారింది.