వార్ వేళ బుద్ధి చూపించుకున్న బాలీవుడ్!
అయితే కమర్షియల్గా ఆలోంచే బాలీవుడ్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తూ తన బుద్ధి చూపించుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
By: Tupaki Desk | 10 May 2025 4:04 PM ISTపహల్గాం సంఘటనని సీరియస్గా తీసుకున్న భారత్ బదులు తీర్చుకోవడానికి కదనరంగంలోకి దూకింది. పాక్ ఆగడాలను, అది పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని లక్ష్యంగా చేసుకుని ఆక్రమిత కశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లపై బాంబుల వర్షం కురిపించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపు దాడులు చేస్తూ దాయాది దేశం పాక్ గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది. ఈ నెల 7 అర్థ్రరాత్రి `ఆపరేషన్ సింధూర్`ని మొదలు పెట్టిన ఇండియన్ ఆర్మీ ఇప్పటికీ కొనసాగిస్తూ పాక్కు బుద్ది చెబుతోంది.
పాక్ తుర్కియే నుంచి దిగుమతి చేసుకున్న డ్రోన్లతో భారత్ బోర్డర్ లోని గ్రామాలపై దాడులకు తెగబడుతోంది. ఆ దాడుల్ని ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొడుతూ పాక్కు ధీటైన జవాబిస్తోంది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఇండియన్ ఆర్మీ చేస్తున్న యుద్ధానికి ప్రముఖులు, సెలబ్రిటీలు, సామాన్య ప్రజలు అండగా నిలుస్తూ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ ఆర్మీకి అండగా నిలుస్తున్నారు.
అయితే కమర్షియల్గా ఆలోంచే బాలీవుడ్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తూ తన బుద్ధి చూపించుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇండియన్ ఆర్మీ మొదలు పెట్టిన `ఆపరేషన్ సింధూర్`ని టైటిల్గా వాడుకుంటూ దేశ ప్రజల భావోద్వేగాల్ని క్యాష్ చేసుకోవాలన్న ప్లాన్తో ఇదే టైటిల్ కోసం బాలీవుడ్కు చెందిన పలువురు నిర్మాతలు పోటీపడటం తెలిసిందే. ఫైనల్గా నిర్మాత నిక్కి విక్కీ భగ్నానీ ఈ టైటిల్ని ఫైనల్ చేసుకుని ఓ సినిమాని నిర్మిస్తున్నట్టుగా ప్రకటించారు.
అంతే కాకుండా ఫస్ట్ లుక్ పోస్టర్నికూడా విడుదల చేశారు. దీంతో మేకర్స్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ ఇంకా జరుగుతూనే ఉంది. భారత్ యుద్ధం ముంగిట ఉంది. ఇలాంటి సమయంలో సున్నితమైన అంశాన్ని క్యాస్ చేసుకోవాలన్న ఆలోచనలో భాగంగానే `ఆపరేషన్ సింధూర్` టైటిల్తో ఆర్టిస్ట్లు కన్ఫర్మ్ కాకుండా, అసలు కథే సిద్ధం చేయకుండా నిక్కివిక్కీ భగ్నానీ ఇలా టైటిల్ పోస్టర్ని విడుదల చేయడం హేయనీయమని నెటిజన్లు సదరు బాలీవుడ్ బ్యాచ్కు సోషల్ మీడియా వేదికగా తలంటేస్తున్నారు.
దీంతో సదరు నిర్మాత డబ్బు కోసమో, లేదా ఫేమ్ కోసమో తాను ఇలా చేయలేదంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. అయినా సరే నెటిజన్లు అతన్ని ట్రోల్ చేయడం ఆపలేదు. ఇదిలా ఉంటే `ఆపరేషన్ సింధూర్` టైటిల్ కోసం బాలీవుడ్కు చెందిన 15 మంది ప్రొడ్యూసర్లు పోటీపడుతుండటం గమనార్హం.