Begin typing your search above and press return to search.

ఓం భీమ్ బుష్ ట్రైలర్..నవ్వులే నవ్వులు!

తాజాగా మేకర్స్.. మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఇక ట్రైలర్ కూడా ఆద్యంతం ఎంటర్టైనింగ్ గా సాగింది.

By:  Tupaki Desk   |   16 March 2024 4:50 AM GMT
ఓం భీమ్ బుష్ ట్రైలర్..నవ్వులే నవ్వులు!
X

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ మరో ఐదు రోజుల్లో ఓం భీమ్ బుష్ సినిమాతో థియేటర్లలోకి రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బ్రోచేవారెవరురా సినిమాలో కామెడీతో ఆకట్టుకున్న ఈ ట్రియో.. మరోసారి అలరించేందుకు సిద్ధమైంది. మార్చి 22వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్.. మూవీపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.

ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ రోల్స్ లో ప్రీతీ ముకుందన్, ఆయేషా ఖాన్ కనిపించనున్నారు. ఇక ఈ మూవీ ద్వారా కొత్త పాయింట్ ను తీసుకొస్తున్నామని ఇటీవల డైరెక్టర్ హర్ష కొనుగంటి చెప్పారు. టీజర్ కూడా ఫన్నీగా, ఇంట్రెస్టింగ్ గా సాగడంతో సినిమాపై ఆడియన్స్ లో మంచి ఆసక్తి నెలకొంది. తాజాగా మేకర్స్.. మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఇక ట్రైలర్ కూడా ఆద్యంతం ఎంటర్టైనింగ్ గా సాగింది.

ట్యాగ్ లైన్ నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్ కు తగ్గట్టు మూవీ విచిత్ర మలుపులు తిరుగుతుందని ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముగ్గురు కూడా తమ కామెడీ టైమింగ్‍ తో అదరగొట్టారు. శ్రీవిష్ణు డైలాగ్ డెలివరీ విచిత్రంగా ఉంది. హీరోయిన్ల గ్లామర్ డోస్ కూడా బాగానే ఉంటుందని తెలుస్తోంది. సంపంగి మహల్‍ లోకి వీరు ముగ్గురు వెళ్లాక ఫన్ వేరే లెవల్.

అయితే ఊరి పేరు ఏంటి అని ప్రియదర్శి అడిగితే సుస్వాగతం అని రాహుల్ రామకృష్ణ ఫన్నీ గా చెబుతారు. భైరవపురం అని చెప్పడు. ఆ తర్వాత భైరవపురం అని ప్రియదర్శి ఫ్రస్టేట్ అవడంతో ట్రైలర్ ముగిసింది. సంగీత దర్శకుడు సన్నీ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇంట్రెస్టింగ్ గా సాగింది. మొత్తానికి సినిమా మాత్రం పొట్ట చెక్కలయ్యేలా అందిరినీ నవ్వించేలా కనిపిస్తోంది.

స్టోరీ లైన్ ఇదే.

సైంటిస్టులమని చెబుతూ ఓ గ్రామంలోకి శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వెళ్తారు. ఎలాంటి సమస్య అయినా ఇట్టే పరిష్కరిస్తామని గ్రామస్తులను నమ్మిస్తారు. ఆ తర్వాత బ్యాంక్ బ్రోస్ క్లబ్‍ ను పెడతారు. వ్యాన్‍ లోనే ఉంటూ రకాలరకాల ప్రయోగాలు చేస్తారు. అయితే సంపంగి మహల్‍ లో నిధి తీసుకురావాలని ఓ సన్యాసి సవాల్ చేస్తారు. దీంతో వారు ఆ మహల్‍ లో అడుగుపెట్టి నిధి కోసం వెతుకుతారు. ఆ సమయంలో వారికి ఎదురైన సవాళ్లు ఏంటి? నిధి దొరికిందా? లేదా అనేది ఓం భీమ్ బుష్ మెయిన్ స్టోరీ లైన్ గా తెలుస్తోంది.