Begin typing your search above and press return to search.

'ఓ మై బేబీ' ఫుల్ సాంగ్.. మహేష్ బుగ్గలే టార్గెట్

గుంటూరు కారం నుంచి రెండో పాటగా వచ్చిన ఓ మై బేబీకి మెలోడియస్ ట్యూన్ ఇచ్చారు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఈ సాంగ్‍కు ప్రముఖ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు.

By:  Tupaki Desk   |   13 Dec 2023 1:02 PM GMT
ఓ మై బేబీ ఫుల్ సాంగ్.. మహేష్ బుగ్గలే టార్గెట్
X

సూపర్స్టార్ మహేశ్ బాబు - శ్రీలీల లీడ్ రోల్స్లో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ ను మొదలుపెట్టి.. ఒక్కో సాంగ్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు మేకర్స్. ఈక్రమంలోనే మొదటి సాంగ్ దమ్ మసాలాను రిలీజ్ చేసి మాస్ దుమ్ము దులిపేశారు. ఇప్పుడు రెండో సాంగ్ ను విడుదల చేశారు.


గుంటూరు కారం నుంచి రెండో పాటగా వచ్చిన ఓ మై బేబీకి మెలోడియస్ ట్యూన్ ఇచ్చారు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఈ సాంగ్‍కు ప్రముఖ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. శిల్పా రావు తన గాత్రాన్ని అందించారు. ప్రస్తుతం ఈ మెలోడీ సాంగ్ పుల్ ట్రెండింగ్ లో ఉంది. మహేశ్ ఫ్యాన్స్ ఈ సాంగ్ ను షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తున్నారు.

సాంగ్ విషయానికొస్తే.. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ కు శిల్ప తన గొంతు ప్రాణం పోశారని నెటిజన్లు అంటున్నారు. పాటను శిల్ప అద్భుతంగా పాడారని చెబుతున్నారు. ఈ పాట టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మెలోడీ సాంగ్ అవ్వనుందని అంటున్నారు. లిరికల్ సాంగ్ మధ్యలో మేకర్స్ సినిమా చిన్న మేకింగ్ వీడియోలను కూడా యాడ్ చేశారు. ఇక సాంగ్ లో మహేష్ బుగ్గలపై ముద్దులు పెట్టాలి అంటూ సాగే ట్యూన్ హైలెట్ అవుతోంది.

మరోవైపు, తమన్ ఈ చిత్రంలో మొత్తంగా 4 నుంచి 5 పాటలు, రెండు థీమ్స్ సాంగ్స్ ఉండేలా చూసుకుంటున్నారట. రెండు మెయిన్ సాంగ్స్, ఓ థీమ్ సాంగ్, ఓ డ్యూయెట్ సాంగ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ డ్యూయెట్ సాంగ్ తాజాగా రిలీజై నట్లుంది. ఈ మూవీలో మహేశ్ బాబు క్యారెక్టరైజేషన్ను ఎలివేట్ చేసేలా ఓ పాట ఉండేలా చూసుకుంటున్నారట.

ఇక సినిమా విషయానికొస్తే.. ఈ మూవీలో శ్రీలీలతోపాటు నటి మీనాక్షి చౌదరీ కీలక పాత్ర పోషిస్తున్నారు. సీనియర్ నటులు జగపతిబాబు, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, ప్రకాశ్ రాజ్, సునీల్, ముకేష్ రిషీ, రఘు బాబు, ఆశీష్ విద్యార్థి తదితరులు కీలక పాత్రలు నటిస్తున్నారు. హారిక అండ్ హసిన్ క్రియేషన్స్ బ్యానర్పై యస్ రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ రూపొందిస్తున్నారు. మూవీ షూటింగ్ ను స్పీడ్గా పూర్తిచేసి 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ విడుదల చేసేందుకు మూవీటీమ్ సిద్ధమవుతోంది.